Publish Date:Mar 21, 2025
వైసీపీ భవిష్యత్ పట్ల ఆ పార్టీ నాయకులు ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీ కీలక నేతలంతా జగన్ కు దూరం జరుగుతూ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బుధవారం (మార్చి 20) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీని కూడా వీడతాననీ, తన కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశం గూటికి చేరతాననీ ప్రకటించారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఇప్పటి వరకూ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. మర్రి రాజశేఖర్ కంటే ముందు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంటకరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే.. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన వైసీపీ తరఫున విజయం సాధించారు. చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఇండిపెండెంట్ గా విజయం సాధించిన మర్రి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు. ఇక 2019 ఎన్నికలలో ఆయన చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019లో చిలకలూరి పేట స్థానం నుంచి విడదల రజనీని జగన్ రంగంలోకి దింపారు. అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోనైనా మర్రి రాజశేఖర్.. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, కేబినెట్ లోకి తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు.
అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ ఇచ్చిన హామీ మేరకు మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం 2023 వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలలో మర్రికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మర్రి రాజశేఖర్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. కాగా రాజీనామా చేయవద్దంటూ జగన్ రాయబారాలు పంపినా మర్రి ఖాతరు చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మర్రి రాజీనామా చేయవద్దంటూ ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/marri-rajasekhar-to-join-tdp-39-194768.html
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.