Publish Date:Jul 22, 2024
ఆంధ్రప్రదేశ్ ను తన ఐదేళ్ల అధ్వాన పాలనతో అస్తవ్యస్థంగా మార్చేసిన జగన్ ఓటమి తరువాత కూడా తన తీరు మార్చుకోలేదు. జనం తిరస్కరించారన్న సోయ కూడా లేకుండా.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయన్న సంగతి విస్మరించి.. వ్యక్తిగత ఘర్షణలకు సైతం పొలిటికల్ కలర్ ఇస్తూ హస్తినలో ధర్నా అంటూ హడావుడి చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ను లైట్ తీసుకోవాలంటూ ఆయన పార్టీకే చెందిన మాజీ ఎంపి మార్గాని భరత్ తెలియకుండానే చెప్పేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన ఓటమికి కారణాలు వివరిస్తూ జగన్ చాతకాని తనాన్ని బయట పెట్టేశారు. జగన్ మద్యం విధానం పార్టీని దారుణంగా దెబ్బతీసిందని అంగీకరించేశారు. ఈ విషయంలో జగన్ తెలివితక్కువగా వ్యవహరించారని మార్గాని భరత్ తన మనసులో మాట చటుక్కున బయటకు చెప్పేశారు.
ఒక టూత్ పేస్ట్ కొనే విషయంలోనే మనకు ఏ బ్రాండ్ కావాలన్నది ఆచితూచి ఎంచుకుంటాం. అటువంటిది మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కోవాలని అనుకోరా అని ప్రశ్నించారు. మేం అమ్మిందే తాగండి అంటే జనం వినరని కూడా భరత్ స్పష్టంగా చెప్పారు. తనకే అర్థమైన ఇంత చిన్న లాజిక్ తమ పార్టీ అధినేత జగన్ కు ఎందుకు అర్ధంకాలేదని పాపం భరత్ ఇప్పుడు బాధ పడుతున్నారు. జగన్ కు మద్యం అలవాటు లేకపోవడం వల్ల ఈ విషయం ఆయనకు తెలియలేదని కవర్ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మద్యం అలవాటు లేకపోతే మాత్రమేం.. రోజూ బ్రష్ చేసుకుంటారు కాదా? అంటూ నెటిజనులు మార్గాని భరత్ కు ఆయన లాజిక్ తోనే ఎదురు సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/margani-bharat-says-jagan-noodle-25-181205.html
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు