మన్మోహన్ ఆధునిక భారత వైతాళికుడు!

Publish Date:Dec 26, 2024

Advertisement

మాజీ ప్రధాని మన్మోహన సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం (డిసెంబర్ 26)   ఢిల్లీ ఎయిమ్స్‌లో  చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు.  92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌ గా   ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.

దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు.  అంతకు ముందు పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను   దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు.  తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది.  ఆ తర్వాత నరేంద్ర మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. 

నేడు మోదీ నాయకత్వంలో బలంగా ఉన్న భారత విదేశాంగ విధానం వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేసిన పటిష్టమైన పునాదులే కారణమనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 90 వ దశకంలో భారత్ తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు భారత్ దౌత్య విధానం, దృక్పథంలో మార్పులు తీసుకొచ్చాయి. అవే పీవీ నరసింహరావుతో కలిసి 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో 1998 నాటి పోఖ్రాన్‌ అణు పరీక్షలు.  ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఆధునిక భారత గమనానికి బాటలు వేశాయి.

మన్మోహన్ ఆర్దికవేత్త అయినప్పటికీ విదేశీ వ్యవహారాలపై కూడా  పట్టు ఉంది. 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత  మన్మోహన్ సింగ్ దేశ విదేశాంగ విధానంపై   దృష్టి సారించారు. భారత విదేశాంగ విధానంలో పోఖ్రాన్ అణు పరీక్షలు కీలకమైనవని విశ్వసించిన మన్మోహన్ సింగ్  వాజ్‌పేయి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో వచ్చిందే అమెరికాతో పౌర అణు ఒప్పందం. మన్మోహన్‌ సింగ్‌ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ముఖ్యమైనదనడంలో సందేహం లేదు మన్మోహన్ సింగ్  దూరదృష్టికి, నాయకత్వ పటిమకు ఈ ఒప్పందం అద్దంపట్టిందని చెప్పవచ్చు. 

వాగ్ధాటి ఉన్నవారే రాజకీయాలలో రాణిస్తారన్న ప్రచారానికి మన్మోహన్ సింగ్ తెరదించారని చెప్పాలి. ఆయన మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని తన పని ద్వారా రుజువు చేసుకున్నారు. దేశ ప్రధానిగా దశాబ్దం పాటు ఆయన సేవలందించారు. ఆ దశాబ్ద కాలంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అయితే ఆయన దేశానికి సేవలందించడం అన్నది ప్రధానిగానే ఆరంభం కాలేదు.  ప్రధానిగా పీవీ నరసింహరావు బాధ్యతలు చేపట్టేనానికి దేశం దివాలా స్థితిలో ఉంది. భారత్ వద్ద విదేశీ మారకద్రవ్యం చాలా తక్కువగా ఉంది.దిగుమతులకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఆ సమయంలో మన్మోహన్ సింగ్  తన ఆర్థిక నైపుణ్యంతో  దేశాన్ని గట్టెక్కించారు.   బంగారాన్ని ప్రత్యేకంగా విమానంలో లండన్ తరలించి తాకట్టు పెట్టి  దేశాన్ని దివాళా స్థితి నుంచి బయటపడేశారు.  ఆయన దూరదృష్టి ఆర్థిక నైపుణ్యం కారణంగానే ఇప్పుడు భారత్  ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నది. 

ప్రత్యక్ష ఎన్నికలలో మన్మోహన్ సింగ్ ఎన్నడూ పోటీ చేసి ఉండకపోవచ్చు.   కానీ ఆయన మాత్రమే దేశాన్ని గాడిలో పెట్టగలరని భావించిన పీవీ నరసింహరావు ఆయనను అర్థిక మంత్రి తన కేబినెట్ లో నియమించారు.  ఆ బాధ్యతను ఆయన అనితర సాధ్యమన్న రీతిలో నిర్వహించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.  తర్వాత కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు సోనియా ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానిగా ఆమె మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసుకోవడం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. సమర్థత ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కింది.    92 ఏళ్ల వయసులో కన్నుమూసిన మన్మోహన్ సింగ్ ముద్ర దేశ ఆర్థిక ప్రయాణంలో  అడుగు అడుగులోనూ కనిపిస్తుందనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.