దేశంలో ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్

Publish Date:Dec 27, 2024

Advertisement

ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.ఆయన కు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అసలు ఆర్ధిక సంస్కరణల కోసమే ఆర్ధిక వేత్త మన్మోహన్ ను రాజకీయాలలోకి పీవీ తీసుకువచ్చారు.

ఆయన తన ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు .బంగారం తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఆర్ధిక వ్యవస్థ ను సుస్థిరం చేసారు.అలా రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవి వరించింది.రాజ్యసభ సభ్యుడిగానే 10 ఏళ్లు ప్రధానిగా ఆ పదవిలో ఉన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు పొందారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబ్ లో జన్మించిన మన్మోహన్, 1958లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రం చదివి, 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో డాక్టరేటు పొందారు. 1978-80మధ్య రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా,1982-85లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ గా కూడా పని చేశారు.

కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసినది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఆయన ఐదు పర్యాయాలు అసోం నుంచి, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఒక్కసారి కూడా లోక్ సభ కు ఎన్నిక కాకపోవడం గమనార్హం. ఆయన ఈ 33ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక గౌరవ పదవులు నిర్వహించారు.ఈ నాటికీ భారత ఆర్థిక వ్యవస్థ చెదరకపోవడానికి ఆనాటి ఆయన ఉక్కు సంకల్పమే కారణమనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి రాజకీయ ఆర్థిక వేత్త భారత్ కు లభించడం,ఆయనను వెలికి తీసిన పీవీ లాంటి మేధావి ఉండడం భారతీయుల అదృష్టం గా భావించాలి. ఆయన నాటిన విత్తే  నేటికీ భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా  కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.

ఆయన ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఆర్ధిక మంత్రి పదవి,ప్రధానమంత్రి పదవి అనుకోకుండా లభించినా ఆ పదవులకు గౌరవం తెచ్చారు. ప్రధాని పదవికి తన విదేశీయత కారణంగా సోనియా గాంధీ అనర్హురాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలతో ఆమె ఆ పదవికి మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసారు. యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీని కలసి ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలను నిర్ణయాలు తీసుకునేవారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే  ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.