Publish Date:Sep 12, 2020
కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీలో జరిగిన మార్పులు తెలంగాణ హస్తం పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులుగా సీనియర్లను కాదని తొలిసారి యువ నేతలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది హైకమాండ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా తమిళనాడుకు చెందిన 45 ఏండ్ల మణికం ఠాగూర్ ను నియమించింది. ప్రస్తుతం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా యువకుడు రావడం ఇదే తొలిసారంటున్నారు.
కొత్త ఇంచార్జి నియామకంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చ జరుగుతోంది. ఇంచార్జ్ గా యువ నాయకుడు వచ్చారు కాబట్టి పీసీసీ పగ్గాలు కూడా యువనేతకే ఇస్తారనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతోంది. తెలంగాణ పీసీసీ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం యువ నేతలకు ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ సహా చాలా రాష్ట్రాలకు యువకులను ఇంచార్జీలుగా నియమించింది. అట్లాగే తెలంగాణ పీసీసీ కూడా యువనేతకే వస్తుందని ఖాయంగా చెబుతున్నారు.
కొత్త ఇంచార్జ్ ఠాగూర్ ఎంపీగా ఉన్నారు. ఆయనతో మన ఎంపీలకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న రేవంత్ రెడ్డితో ఠాగూర్ కు ఫ్రెండి షిప్ ఉందంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ధీటుగా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ ఎంపీల్లో ఉందంటున్నారు. లోక్ సభలోనూ పలువురు ఎంపీలు ఈ విషయంలో రేవంత్ ను అభినందించినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ ఉందనే అభిప్రాయం హైకమాండ్ కు ఉందంట. ఇలా ఏ రకంగా చూసినా తెలంగాణ పీసీసీ పగ్గాలు యువకుడైన రేవంత్ రెడ్డిపై వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పీసీసీ నాయకత్వ మార్పుపై ప్రచారం జరుగుతోంది. కాని ఛేంజ్ మాత్రం జరగలేదు. అయితే త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీని నియమిస్తారని అనుకుంటున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటి .. పీసీసీ రేసులో తనకు పోటీ లేకుండా చూసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తన లోక్ సభ పరిధిలోకి వచ్చే గ్రేటర్ లోని 48 డివిజన్లలో మెజార్టీ సీట్లు సాధించేలా ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manickam-tagore-new-congress-general-secretary-in-telangana-25-103993.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.