మధుర ఫలం...ధర అధ్వాన్నం..ఢీలా పడ్డ మామిడి రైతు

Publish Date:Jun 3, 2025

Advertisement

 

కడప:

మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది. ఈ మార్కెట్లో ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందంటే ఇక్కడ  మామిడి దిగుబడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఇంత పెద్ద ప్రాధాన్యం ఉన్న  కోడూరు మార్కెట్  కళ తప్పింది .కిలో 5 రూపాయల అంటే టన్ను కేవలం 5 వేల రూపాయలకు మాత్రమే ధర పలుకుతుండడంతో మామిడి రైతులు తీవ్ర నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది.


 మామిడి సాగు చేస్తున్న రైతులకు  ప్రతి ఏటా ప్రతికూల వాతావరణ పరిస ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, పెనుగాలులు,మంచు ప్రభావం, మామిడి  దిగుబడుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అష్టకష్టాలకు గురై  వీటన్నింటిని ఎదుర్కొని మార్కెట్ లో విక్రయించు కోవడానికి వస్తే మధ్య దళారుల బెడద.దీంతో గిట్టుబాటు దరలు లేక నష్టం పోక తప్పడం లేదు.ఈ పరిస్థితుల్లో మామిడి బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

*డిమాండ్ లేక ఢీలా

 ఈ సారి ఇక్కడి మామిడికి డిమాండ్ లేదన్న సాకుతో జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలను  తగ్గించేశారు. దీంతో  ఇటు మామిడి రైతులు, అటు వ్యాపారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో  వున్న జ్యూస్ పరిశ్రమల్లో ఎక్కువధరలతో మామిడి  కాయాలను ఎగుమతి చేసుకుంటున్నారని  రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే పుంజు కుంటున్న మామిడి ధరలు ఆశించినంత లేక పోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.

*55 వేల ఎకరాల్లో సాగు

    ఉమ్మడి కడప జిల్లాలోనే అత్యంధికంగా  మంచి మేలు కరమైన మామిడి రైల్వేకోడూరు ప్రాంతంలో 55 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైల్వేకోడూరులో పండించే మామిడి కాయల్లో తోతాపూరి అనే కరం గతంలో జ్యూస్ పరిశ్రమలకు దిగుమతి చేసే వారు. రానురాను దాని తర్వాత ఆల్ఫోన్సా(ఖాదర్) ఎక్కువగా జ్యూస్ పరిశ్రమలకు ఎగుమతులు చేసే వారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఊరగాయాలకు ఉపయోగించే కాయలు తప్ప మిగిలిన అన్ని మామిడి రకాలను జ్యూస్ కు పంపిస్తున్నారు. రైల్వేకోడూరు ప్రాంతంలో పండించే మామిడికి మంచి డిమాండ్ వుంటుంది. ఈ ప్రాంతంలో బేనీషా, నీలం, తోతాపురి, ఖాదర్, మల్లిక, కాలేపాడు, రుమాణి, మల్గోవా, పులిహోరా, హిమాంపసందు రకాలు పండిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రైల్వేకోడూరు మామిడి కాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు కాయలను రైతులు, వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. 

*చిత్తూరు జ్యూస్ పరిశ్రమలకు

 చిత్తూరు జిల్లాలో జ్యూస్ పరిశ్రమలు ఎక్కువగా వున్నాయి. ఈ పరిశ్రమల కు రైల్వేకోడూరు నుంచి ప్రతి రోజూ 10 లారీల్లో మామిడి కాయలనుఎగుమతి చేస్తున్నారు. పులిహోరా రకం టన్ను రూ.5 వేలు, బేనీషా రూ.5 వేలు, తోతాపురి టన్ను రూ.5 వేలుకు జ్యూస్ యజమానులు  సిండికేట్ అయ్యి  ధరలు నిర్ణయించారని రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.   పులిహోరా రకం టన్ను  రూ.15వేలు, తోతాపూరి రూ.15 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే జ్యూస్ పరిశ్రమ యజమానులు ధరలు పెంచేందుకు ససేమిరా అంగీకరించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సీజన్ మధ్యలో రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి రోజుకు సుమారు 100 లారీల్లో జ్యూస్ కు ఎగుమతి చేస్తామని రైతులు అంటున్నారు. జ్యూస్  పరిశ్రమల యజమానులు ధరలు పెంచితే మామిడి కాయలను ఎగుమతి చేస్తామని రైతులు భీష్మించుకు కూర్చుని కొన్ని రోజుల పాటు కోతలు నిలిపివేశారు. కొందరు రైతులు మాత్రమే జ్యూస్ కు ఎగుమతి చేస్తున్నారు.

*మామిడి బోర్ ఏర్పాటు చేస్తేనే

  ఇటీవల చిత్తూరులో తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరల విషయమై రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల ప్రతినిధులతో సమావేశాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు  దుగ్గిమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్  సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, నగరి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ , మురళీమోహన్, గాలి భాను ప్రకాష్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టర్లు జి విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, తుడా చైర్మెన్ కటారి హేమలతలతో కలిపి సమావేశం నిర్వహించారు. 
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటే మామడి బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కు మామిడి రైతుల కష్టాలు వివరిస్తామని సమావేశంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.  మామిడి గుజ్జు, జ్యూస్ ల పై జి.ఎస్.టిలు ఎత్తివేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్లు వివరించారు. మామిడి సీజన్ లో తోతాపురి రకానికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీలు సమన్వయం ఎంతో అవసరమని జాయింట్ కలెక్టర్లు సమావేశంలో వివరించారు. 

*గుజ్జు కు తగ్గిన డిమాండ్.

మామిడిలో షుగర్ లెవల్స్  ఎక్కువగా వున్నాయని, గుజ్జుకు డిమాండ్ తగ్గిందని, ఎనర్జీ డ్రింక్స్ పట్ల ఆసక్తి చూపడంతో మామిడి  డ్రింక్స్ వాడకం తగ్గుతోందని ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.  జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలు పెంచుతారా లేక ఉన్న ధరలతోనే కొనుగోలు చేస్తారా అనే విషయం  తెలియక పోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*ఎక్స్ పోర్ట్ కు తగ్గిన డిమాండ్.

కోడూరు మామిడి కి జ్యూస్ ఫ్యాక్టరీల పరిస్థితే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ డిమాండ్ తగ్గడం కూడా ధరల పతనానికి కారణం అయ్యింది .ఈసారి పంట ఆలస్యంగా రావడంతో ఇంతకంటే ముందే ఢిల్లీ ,ఆగ్రా, అహ్మదాబాద్ ,మహారాష్ట్ర తదితర ప్రదేశాల పరిసర ప్రాంతాల రాష్ట్రాల నుంచి ముందుగానే ఆ ప్రాంతాలకు మామిడి చేరింది. దీంతో ఆలస్యంగా దిగుబడి వచ్చిన కోడూరు మామిడి కి డిమాండ్ తగ్గినట్లు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న వ్యాపారులు ఐదు రూపాయలకు మించి కొనుగోలు చేయడంలేదు.

*ఎమ్మెల్యే ప్రయత్నాలు 

మామిడి రైతులు ధరలు లేక రైతులు విల విలలాడుతున్న విషయాన్ని తెలుసుకున్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, అరవ శ్రీధర్, కూడ చైర్మెన్ ముక్కా రూపానందరెడ్డిలు రైల్వేకోడూరు మామిడి  యార్డును సందర్శించారు. రైతులతో గిట్టుబాటు ధరల పై చర్చించారు. అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చామకూరి దృష్టికి తీసుకెళ్లారు.  జ్యూస్ పరిశ్రమలకు టన్ను మామిడికాయలను రూ.10 వేలకు తక్కువ కాకుండా చూస్తామని హామీ ఇచ్చి రెండు రోజులు గడుస్తున్నా జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలు పెంచలేదు.రైల్వేకోడూరు మండల రైతులు   మాట్లాడుతూ ప్రతి ఏడాది నష్టాలు తప్పడం లేదన్నారు.ఒక్క కిలో మామిడి కాయలు పండించాలంటే రూ.10లుఖర్చుఅవుతుెదంన, జ్యూస్ పరిశ్రమల యజమానులు రూ.5 లకు అడుగుతున్నారు. మామిడి సాగుకు ఖర్చులు పెరిగాయి, దిగుబడి వస్తే ధరలు లేకుండా పోతాయి,  కాపు రాక పోతే చేసిన కష్టం రాకుండా  పోతుందని వాపోయారు. మామిడి బోర్డు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.