మధుర ఫలం...ధర అధ్వాన్నం..ఢీలా పడ్డ మామిడి రైతు

Publish Date:Jun 3, 2025

Advertisement

 

కడప:

మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది. ఈ మార్కెట్లో ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందంటే ఇక్కడ  మామిడి దిగుబడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఇంత పెద్ద ప్రాధాన్యం ఉన్న  కోడూరు మార్కెట్  కళ తప్పింది .కిలో 5 రూపాయల అంటే టన్ను కేవలం 5 వేల రూపాయలకు మాత్రమే ధర పలుకుతుండడంతో మామిడి రైతులు తీవ్ర నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది.


 మామిడి సాగు చేస్తున్న రైతులకు  ప్రతి ఏటా ప్రతికూల వాతావరణ పరిస ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, పెనుగాలులు,మంచు ప్రభావం, మామిడి  దిగుబడుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అష్టకష్టాలకు గురై  వీటన్నింటిని ఎదుర్కొని మార్కెట్ లో విక్రయించు కోవడానికి వస్తే మధ్య దళారుల బెడద.దీంతో గిట్టుబాటు దరలు లేక నష్టం పోక తప్పడం లేదు.ఈ పరిస్థితుల్లో మామిడి బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

*డిమాండ్ లేక ఢీలా

 ఈ సారి ఇక్కడి మామిడికి డిమాండ్ లేదన్న సాకుతో జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలను  తగ్గించేశారు. దీంతో  ఇటు మామిడి రైతులు, అటు వ్యాపారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో  వున్న జ్యూస్ పరిశ్రమల్లో ఎక్కువధరలతో మామిడి  కాయాలను ఎగుమతి చేసుకుంటున్నారని  రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే పుంజు కుంటున్న మామిడి ధరలు ఆశించినంత లేక పోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.

*55 వేల ఎకరాల్లో సాగు

    ఉమ్మడి కడప జిల్లాలోనే అత్యంధికంగా  మంచి మేలు కరమైన మామిడి రైల్వేకోడూరు ప్రాంతంలో 55 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైల్వేకోడూరులో పండించే మామిడి కాయల్లో తోతాపూరి అనే కరం గతంలో జ్యూస్ పరిశ్రమలకు దిగుమతి చేసే వారు. రానురాను దాని తర్వాత ఆల్ఫోన్సా(ఖాదర్) ఎక్కువగా జ్యూస్ పరిశ్రమలకు ఎగుమతులు చేసే వారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఊరగాయాలకు ఉపయోగించే కాయలు తప్ప మిగిలిన అన్ని మామిడి రకాలను జ్యూస్ కు పంపిస్తున్నారు. రైల్వేకోడూరు ప్రాంతంలో పండించే మామిడికి మంచి డిమాండ్ వుంటుంది. ఈ ప్రాంతంలో బేనీషా, నీలం, తోతాపురి, ఖాదర్, మల్లిక, కాలేపాడు, రుమాణి, మల్గోవా, పులిహోరా, హిమాంపసందు రకాలు పండిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రైల్వేకోడూరు మామిడి కాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు కాయలను రైతులు, వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. 

*చిత్తూరు జ్యూస్ పరిశ్రమలకు

 చిత్తూరు జిల్లాలో జ్యూస్ పరిశ్రమలు ఎక్కువగా వున్నాయి. ఈ పరిశ్రమల కు రైల్వేకోడూరు నుంచి ప్రతి రోజూ 10 లారీల్లో మామిడి కాయలనుఎగుమతి చేస్తున్నారు. పులిహోరా రకం టన్ను రూ.5 వేలు, బేనీషా రూ.5 వేలు, తోతాపురి టన్ను రూ.5 వేలుకు జ్యూస్ యజమానులు  సిండికేట్ అయ్యి  ధరలు నిర్ణయించారని రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.   పులిహోరా రకం టన్ను  రూ.15వేలు, తోతాపూరి రూ.15 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే జ్యూస్ పరిశ్రమ యజమానులు ధరలు పెంచేందుకు ససేమిరా అంగీకరించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సీజన్ మధ్యలో రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి రోజుకు సుమారు 100 లారీల్లో జ్యూస్ కు ఎగుమతి చేస్తామని రైతులు అంటున్నారు. జ్యూస్  పరిశ్రమల యజమానులు ధరలు పెంచితే మామిడి కాయలను ఎగుమతి చేస్తామని రైతులు భీష్మించుకు కూర్చుని కొన్ని రోజుల పాటు కోతలు నిలిపివేశారు. కొందరు రైతులు మాత్రమే జ్యూస్ కు ఎగుమతి చేస్తున్నారు.

*మామిడి బోర్ ఏర్పాటు చేస్తేనే

  ఇటీవల చిత్తూరులో తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరల విషయమై రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల ప్రతినిధులతో సమావేశాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు  దుగ్గిమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్  సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, నగరి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ , మురళీమోహన్, గాలి భాను ప్రకాష్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టర్లు జి విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, తుడా చైర్మెన్ కటారి హేమలతలతో కలిపి సమావేశం నిర్వహించారు. 
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటే మామడి బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కు మామిడి రైతుల కష్టాలు వివరిస్తామని సమావేశంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.  మామిడి గుజ్జు, జ్యూస్ ల పై జి.ఎస్.టిలు ఎత్తివేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్లు వివరించారు. మామిడి సీజన్ లో తోతాపురి రకానికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీలు సమన్వయం ఎంతో అవసరమని జాయింట్ కలెక్టర్లు సమావేశంలో వివరించారు. 

*గుజ్జు కు తగ్గిన డిమాండ్.

మామిడిలో షుగర్ లెవల్స్  ఎక్కువగా వున్నాయని, గుజ్జుకు డిమాండ్ తగ్గిందని, ఎనర్జీ డ్రింక్స్ పట్ల ఆసక్తి చూపడంతో మామిడి  డ్రింక్స్ వాడకం తగ్గుతోందని ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.  జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలు పెంచుతారా లేక ఉన్న ధరలతోనే కొనుగోలు చేస్తారా అనే విషయం  తెలియక పోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*ఎక్స్ పోర్ట్ కు తగ్గిన డిమాండ్.

కోడూరు మామిడి కి జ్యూస్ ఫ్యాక్టరీల పరిస్థితే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ డిమాండ్ తగ్గడం కూడా ధరల పతనానికి కారణం అయ్యింది .ఈసారి పంట ఆలస్యంగా రావడంతో ఇంతకంటే ముందే ఢిల్లీ ,ఆగ్రా, అహ్మదాబాద్ ,మహారాష్ట్ర తదితర ప్రదేశాల పరిసర ప్రాంతాల రాష్ట్రాల నుంచి ముందుగానే ఆ ప్రాంతాలకు మామిడి చేరింది. దీంతో ఆలస్యంగా దిగుబడి వచ్చిన కోడూరు మామిడి కి డిమాండ్ తగ్గినట్లు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న వ్యాపారులు ఐదు రూపాయలకు మించి కొనుగోలు చేయడంలేదు.

*ఎమ్మెల్యే ప్రయత్నాలు 

మామిడి రైతులు ధరలు లేక రైతులు విల విలలాడుతున్న విషయాన్ని తెలుసుకున్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, అరవ శ్రీధర్, కూడ చైర్మెన్ ముక్కా రూపానందరెడ్డిలు రైల్వేకోడూరు మామిడి  యార్డును సందర్శించారు. రైతులతో గిట్టుబాటు ధరల పై చర్చించారు. అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చామకూరి దృష్టికి తీసుకెళ్లారు.  జ్యూస్ పరిశ్రమలకు టన్ను మామిడికాయలను రూ.10 వేలకు తక్కువ కాకుండా చూస్తామని హామీ ఇచ్చి రెండు రోజులు గడుస్తున్నా జ్యూస్ పరిశ్రమల యజమానులు ధరలు పెంచలేదు.రైల్వేకోడూరు మండల రైతులు   మాట్లాడుతూ ప్రతి ఏడాది నష్టాలు తప్పడం లేదన్నారు.ఒక్క కిలో మామిడి కాయలు పండించాలంటే రూ.10లుఖర్చుఅవుతుెదంన, జ్యూస్ పరిశ్రమల యజమానులు రూ.5 లకు అడుగుతున్నారు. మామిడి సాగుకు ఖర్చులు పెరిగాయి, దిగుబడి వస్తే ధరలు లేకుండా పోతాయి,  కాపు రాక పోతే చేసిన కష్టం రాకుండా  పోతుందని వాపోయారు. మామిడి బోర్డు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.