నారా వారి ప్రాపకం కోసం మంచు వారి వెంపర్లాట.. వద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు!

Publish Date:Jan 15, 2025

Advertisement

మంచు కుటుంబంలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. అన్నదమ్ముల ఆస్తుల వివాదం కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయే వరకూ దారి దీసింది. మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్ ఒక వైపు అన్నట్లుగా కుటుంబం చీలిపోయింది. పలు మార్లు దాడులు, ప్రతి దాడుల వరకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు, అటు మంజు విష్ణు కూడా రాజకీయ అండ కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు, అండ కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో  ప్రదర్శించిన ప్లెక్సీల్లో మోహన్ బాబు ఫొటోతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా ఉంది. 

వాస్తవానికి మోహన్ బాబుకు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవు. జగన్ హయాంలో మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చంద్రబాబుపైనా, తెలుగుదేశంపైనా ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.  సరే జగన్ కోసం ఎంతగా పని చేసినా, 2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో అప్పటి తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలూ నిర్వహించినా జగన్ నుంచి మోహన్ బాబుకు ఎటువంటి ప్రశంసా రాలేదు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మోహన్ బాబుకు ఏదో కీలక కార్పొరేషన్ పదవి, రాజ్యసభ సభ్యత్వం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతే. జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు.

 దీంతో విసిగి వేసారిన మోహన్ బాబు జగన్ కు దూరం జరిగారు. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం చేయలేదు సరికదా.. ఎన్నికల ముందు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చివరికి అదీ జరగలేదు. ఇక గత కొంత కాలంగా మోహన్ బాబు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. అయితే అదేమీ ఆయన నటనావైదుష్యం కారణంగానో, విద్యాసంస్థల అధినేతగా వచ్చిన పేరు ప్రతిష్ఠల కారణంగానో కాదు, కుటుంబ గొడవలలొ వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా ఆయన వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. జర్నలిస్టుపై దాడి కేసులో అరెస్టును తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లిన కారణంగా వార్తల్లో నిలిచారు.  

అలాగే ఆయన విద్యాసంస్థల విషయంలో  ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ విద్యా సంస్థలలో ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ బాబు విద్యాసంస్థపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు చంద్రబాబుతో గతంలో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుని ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో చంద్రబాబు ఫ్లెక్సీల ప్రదర్శన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఊసరవిల్లి సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తున్నారనీ, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న చందంగా మోహన్ బాబు వ్యవహార శైలి ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మరో వైపు తండ్రితో, సోదరుడు విష్ణుతో విభేదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ కూడా చంద్రబాబుకు దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కనుమ పండుగ రోజున మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారా వారి పల్లె వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.  
మోహన్ బాబు కుటుంబం ఇలా చంద్రబాబు, లోకేష్ మద్దతు కోసం పాకులాడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం వీరి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచు కుటుంబాన్ని చంద్రబాబు, లోకేష్ దూరం పెట్టడమే మంచిదన్న అభిప్రాయాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.   

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.