Publish Date:Oct 15, 2019
872 కిలో మీటర్లు విస్తరించి ఉన్న బందిపూర్ టైగర్ రిజర్వులో పెద్దపులి టెర్రర్ సృష్టించింది.ప్రజలను నిద్ర లేకుండా చేసి ఊరంత భయబ్రాంతులకు గురి చేసింది.ఎట్టకేలకు ఆపరేషన్ బిగ్ టైగర్ సక్సెస్ అయింది. ఇద్దరు గ్రామస్థులను పధ్ధెనిమిది పశువులను పొట్టబెట్టుకున్న రాక్షస పులిని ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు బంధించారు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.
కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో హడలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. ఇద్దరు గ్రామస్థులతో పాటు పధ్ధెనిమిది పశువుల్ని పొట్టనబెటుకున్న ఈ పెద్దపులి కోసం ఫారెస్టు అధికారులు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. స్థానిక గిరిజనుల సహకారంతో ఈ పులిని ఎట్టకేలకూ బందించారు. అధికారులు పులిని పట్టుకోడానికి ఏకంగా ఆరు ఏనుగుల్ని ఓ వేటకుక్కను ఉపయోగించారు. మనుషులు పశువుల రక్తాన్ని రుచిమరిగిన ఈ రాక్షస పెద్దపులిని బందించటానికి గత ఐదు రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. ఓ పొదలో నక్కిన పులిని వేటకుక్కతో పాటు రెండు ఏనుగులు గుర్తించాయి.
మనిషి రక్తం రుచిమరిగిన పులిని చంపేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఫారెస్టు అధికారులు వారికి నచ్చజెప్పారు. మత్తుమందు ప్రయోగించి పెద్దపులిని బందించారు. మత్తుమందుకి కూడా తొలుత పెద్దపులి లొంగలేదు. ఇంకో పొదలోకి వెళ్లింది. అయితే పులినక్కిన పొదలను స్థానిక స్థులిజ గిరిజనులు గుర్తించి వలలో బంధించారు. ఆ తరువాత పెద్ద పులిని మైసూర్ జూ కు తరలించారు. చివరకు దాన్ని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపులి జాడను గుర్తించడానికి అటవీ శాఖాధికారులు డ్రోన్ లు కూడా ఉపయోగించారు. డ్రోన్ కెమెరాలు పులి కదలికల్ని పసిగట్టాయి. వందలాది మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. చివరకు ఆపరేషన్ సక్సెస్ కావడంతో స్థానికులు, గిరిజనులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/man-eating-tiger-in-karnataka-forest-traced-and-captured-25-90086.html
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.