Publish Date:Feb 13, 2020
సైబర్ నిందితుడు కందగట్ల భాస్కర్ అరెస్ట్ లో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. రుణాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని మొబైల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల వీడియోలను చూసి ఖంగుతిన్నారు ఖాకీలు. కామాంధుడైన కందగట్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కందగట్ల భాస్కర్ అరెస్టులో సరికొత్త ట్విస్ట్ ఎదురైంది. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపిస్తూ సుమారు నూట యాభై మందికి పైగా మహిళలను భాస్కర్ వేధించినట్లు తేలింది. భాస్కర్ సెల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలను టార్గెట్ చేసి అశ్లీల వీడియోలు, న్యూడ్ వీడియో కాల్స్ తో వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
జనగామ జిల్లా నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ గతంలో ఆరోగ్య శ్రీ విభాగంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేశారు. ప్రస్తుతం సొంతూరిలో వ్యవసాయం చేస్తున్నాడు, తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ అండ్ మోనిటరింగ్ సిస్టం పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించేవాడు. అలా మహిళల వివరాలను సేకరించి దుర్వినియోగం చేశాడు భాస్కర్. ఎన్జీవోలో పనిచేస్తున్నానంటూ కలరింగ్ ఇచ్చి, రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికే వాడు. మహిళలతో పరిచయం పెంచుకొని అశ్లీల వీడియోలు పంపేవాడు, సిమ్ కార్డులు మారుస్తూ వాట్సాప్ లో న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు 150 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. భాస్కర్ వేధింపుల బారిన పడిన వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ పై 2007లో లింగాల ఘణపురం లోనే ఇలాంటి కేసు నమోదవడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయినా భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు, ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న అతడిని మరోసారి విచారణ జరుపుతున్నారు పోలీసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/man-arrested-in-hyderabad-over-sexual-assault-on-women-25-94230.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.