20 మంది టీఎంసీ ఎంపీల తిరుగుబాటు షాక్ టీఎమ్ సీపై మమత పట్టు జారిపోయిందా?

Publish Date:Jun 9, 2026

Advertisement

 

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్   పార్టీ (టీఎమ్సీ) ప్రస్తుతం పీకల్లోతు  సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ఆ పార్టీ పునాదులను కదిలించేసింది. బెంగాల్ అసెంబ్లీలో గెలిచిన మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మందికి పైగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే.

ఆ షాక్ నుంచి మమత తేరుకోకముందే..  టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది.  ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే   కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో  ఇండియా' కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు   తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే టీఎమ్సీపై మమతా బెనర్జీ పూర్తిగా పట్టు కోల్పోయారని అనిపిస్తోంది.  

 గడిచిన 13 సంవత్సరాలుగా రాజ్యసభలో టీఎంసీ చీఫ్ విప్‌గా సేవలందించిన సీనియర్ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మరో ఐదుగురు లోక్‌సభ ఎంపీలతో అత్యవసరంగా సమావేశం కావడం  కలకలం రేపింది. ఆ తర్వాత బెంగాల్ మాజీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో సుమారు 20 మంది టీఎంసీ లోక్‌సభ సభ్యులు కేంద్ర మంత్రి, బెంగాల్ ఎన్నికల వ్యూహకర్త భూపేందర్ యాదవ్ నివాసంలో భేటీ అయ్యారు.

ఈ తిరుగుబాటు ఎంపీల బృందానికి సీనియర్ నాయకురాలు కాకొలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహిస్తున్నారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలిగా పేరున్న దస్తీదార్..  ఇటీవల తనను  లోక్‌సభ చీఫ్ విప్ పదవి నుంచి తనను తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమతో పాటు ఉన్న 20 మంది ఎంపీల సంతకాలతో ఎన్డీయే కూటమిలో చేరతామంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు.

ప్రజాప్రతినిధులు ఇలా బహిరంగంగా తిరుగుబాటు చేస్తుంటే..  క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల నేతలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అవినీతికి పాల్పడ్డారంటూ ఒక టీఎంసీ కౌన్సిలర్‌కు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించిన ఘోర ఉదంతం బెంగాల్‌లోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.

మరోవైపు మమతా బెనర్జీ కుటుంబ రాజకీయాల చుట్టూ కూడా వివాదాలు ముసురుకున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని  మమతా బెనర్జీకి ప్రతిపాదించగా, ఆమె తిరస్కరించినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  

అయినప్పటికీ అభిషేక్ బెనర్జీ ప్రాభవాన్ని తగ్గించడానికి మమత అదనంగా ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఇటీవలే సోనార్‌పూర్‌లో పర్యటించిన అభిషేక్ బెనర్జీపై స్థానికులు రాళ్లు, గుడ్లు, చెప్పులతో దాడి చేశారు. రక్షణ కోసం ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. నామినేషన్ పత్రాల్లో ఫోర్జరీ సంతకాల వివాదంలో అభిషేక్ బెనర్జీకి సీఐడీ  సమన్లు కూడా జారీ చేసింది.   15 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్, తన రాజకీయ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన మనుగడ పోరాటాన్ని ఎదుర్కొంటోంది.

By
en-us Political News

  
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.