నాచారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం

Publish Date:Apr 18, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిల్కా నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న టెంట్ హౌస్‌కు చెందిన గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గోదాంలో నిల్వ ఉంచిన టెంట్లు, అలంకరణ సామగ్రి తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంనికి ఆనుకుని ఉన్న పరుపుల కంపెనీకి మంటలు వ్యాపించే ప్రమాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు అరగంటకు పైగా తీవ్రంగా శ్రమించారు. వారి సమయోచిత చర్యలతో మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే గోదాంలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By
en-us Political News

  
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం గొడవలు, విమర్శలు సర్వసాధారణం.
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ ఆధునిక కాలంలో, విద్యా రంగంలో డిజిటల్ పరికరాల వాడకం సర్వసాధారణమైపోయింది.
సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఉదయం ఉత్కంఠ భరిత దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలను నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
పాప ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో.. ఆ కుటుంబం ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను సహాయం కోసం అర్దించారు. వారి అభ్యర్థనకు తక్షణమే స్పందించిన నారా లోకేష్.. చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు.
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే చిన్న చిన్న పనులు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.