Publish Date:Oct 21, 2019
హుజూర్ నగర్ ఉప ఎన్నికల పై వివిధ పార్టీలు చాలా ఆసక్తి చూపించాయి.ఎవరికి తగ్గ రీతిలో తమ దైన శైలిలో ప్రచారాలతో ముందుకుపోయారు పార్టీ నేతలు.ప్రచారల గడువు ముగిసిన తరువాత కూడా అధికారులు ఎంత నిఘా పెట్టినా హుజూర్ నగర్ లో జరగాల్సిన కార్యక్రమం జరిగింది. రాత్రికి రాత్రే ఎవరికి కావాల్సిన సరుకు వారికి చేరిపోయింది. కోట్లాది రూపాయల డబ్బును పార్టీలు పంచేశాయి. పీపాలకు పీపాల మద్యాన్ని తాగించేశాయి.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నోట్ల కట్టలు చేతులు మారాయి. మద్యం ఏరులై పారింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి ఒకెత్తయితే చివరి రెండ్రోజులు ఒకెత్తు అన్నట్టుగా ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నించాయి. ఒక్క శనివారం రాత్రే సుమారు ముప్పై ఐదు కోట్లు పంపిణీ చేశారు. హోరాహోరీ తలపడుతున్న రెండు పార్టీలు కేవలం మద్యానికే ఆరు కోట్లు ఖర్చు చేశాయి. మండల స్థాయి నాయకులకు చెక్కుల ద్వారా డబ్బులు అందించగా వారు ముందుగా శనివారం రాత్రికి రాత్రే పంపిణీ పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల స్థానిక వ్యాపారులు పెట్టుబడిదారుల వద్ద చేబదులుగా తీసుకుని స్థానిక నేతలకు అందజేశారు.
మరోవైపు హుజూర్ నగర్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన డబ్బును వివిధ సంఘాల నేతలు వారి అనుచరులకు అప్పగించారు. వారంతా ఆ కొద్ది మొత్తాన్నే ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుల మాదిరిగా వచ్చి ఎంచుకున్న ప్రాంతాలకు డబ్బు సంచులను చేరవేశారు. అరవై మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీ చొప్పున నియమించిన ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీలో వారిని కీలకం చేశాయి. ఒక ప్రధాన పార్టీ ఓటర్ కు వెయ్యి రూపాయలు పంచగా, మరో పార్టీ ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చింది. మరోవైపు డబ్బులిస్తూనే కొందరు కార్యకర్తలు ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారు. కళ్లేపల్లి మైసమ్మ, దుప్పలపల్లి మైసమ్మ దేవతల వద్ద మొక్కి తెచ్చామని డబ్బులు తీసుకున్న వారు తాము చెప్పిన గుర్తుకు ఓటు వేయాలని లేదంటే ఆ దేవతల ఆగ్రహానికి గురవుతారు అంటూ వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటు ఎన్నికల కమిషన్ సిబ్బంది, ఇటు నిఘా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినపడుతున్నాయి.ఇక పార్టీ నేతల ప్రయత్నాలు సఫలం అయ్యాయో లేదో ఫలితాల నాడే తేలనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/main-parties-distributed-money-and-liquor-to-voters-in-huzurnagar-25-90380.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.