‘మహా’ పాఠం మరో గుణ పాఠం

Publish Date:Jun 23, 2022

Advertisement

అది ఉద్ధవ్‌ ఠాక్రేనే కానక్కరలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కావచ్చును. కాదంటే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చును, దేశాన్ని పాలిస్తున్న ప్రధాన మంత్రి అయినా కావచ్చును. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా ప్రవర్తిస్తే, అంతా బాగుందని, అనుకుంటే, ఇదిగో ఇలాగే, ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఉరమని ఉరుములా, ‘మహా’ విపత్తు విరుచుకు పడుతుంది. అలా,  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా, ఉద్ధవ్‌ ఠాక్రే’లా లబో దిబో మన్నా ప్రయోజనం ఉండదు. అర్థరాత్రి పెట్టే బేడా సర్దుకుని, పోవడం తప మరో మార్గం ఉండదు. అయితే, పాలకుల తలలో చేరిన అజ్ఞాన, ఆహంకారానికి  అన్ని సందర్భాలో పార్టీలో అంతర్గత తిరుగుబాటే  సమాధానం కానవసరం లేదు. చివరాఖరికి ప్రజలు ఇచ్చే తీర్పు రూపంలోనూ, ప్రజలు గుణ పాఠం చెపుతారు. నేతలకు కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి ఎదురైనా కావచ్చును. 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఓడి పోయిన తర్వాత, ఎంతవరకు నిజమో ఏమో కానీ, మీడియాలో ఒక ప్రచారం జరిగింది. ‘ఓటమి ఓకే .. కానీ, మరీ ఇంత ఘోరంగానా? మనంచేసిన తప్పేంటి .. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏమిటి? అంటూ చంద్రబాబు నాయుడు, పార్టీ  సమావేశాల్లో విస్మయం వ్యక్త పరిచినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్త పరిచింది నిజం అయినా కాకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను చూడలేక పోవడం ఎంత ప్రమాదకరమో చెప్పుకునేందుకు ఈ  ఉదంతం ఒక గుణపాఠంగా అయితే నిలిచింది.  ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో ఈ ప్రమాదం మరి కొంత ఎక్కువగా ఉంటుంది. అధినాయకుడు నందంటే నంది, కాదంటే  కాదు..అనే అతి విధేయత జాతీయ పార్టీలలో కంటే ప్రాంతీయ పార్టీలలో కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది.

ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అదే పరిస్థితి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, ఇన్ని మీటలు నొక్కాం... ఇన్ని వందల వేల కోట్లు ప్రజల ఖాతాలలో జమ చేశాము...సో .. 175 కు 175 సీట్లు మనకే వస్తాయి, ఎందుకు రావు? అంటూ పార్టీ  సమావేశంలో  విశ్వాసం  వ్యక్త పరిచారు. అది విశ్వాసం అనాలో అతి విశ్వాసం అనాలో గానీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అలా ఉందా ? అని ఒక్క నిముషం ఆలోచిస్తే, అలంటి పరిస్థతి లేదని చెప్పడం కష్టం కాదు.   ప్రభుత్వ పథకాల వలన ప్రయోజనం పొందిన ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అందుకే, గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు ఎక్కడిక్కడ ఎమ్మెలను నిలదీశారు. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అబ్బే అదేమి లేదు, అంతా బాగుంది అనే భ్రమల్లోనే ఉన్నారంటే, అది ఆయనలోని అజ్ఞానానికి నిదర్శనమా,  అహంకారానికి నిదర్శనమా అనేది ఆయనే తెలుసు కోవలసి ఉంటుంది  తప్ప మరొకటి కాదని,వైసీపీ నేతలే అంటున్నారు.

ప్రజలను కొనేయడం అంత పెద్ద విషయమే కాదనే దురహంకారంతోనే ఆయన అంతోటి ధీమా వ్యక్తం చేశారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదనే  వైసీపీ పెద్దలు ‘దీవెనలు ’ కూడా అందిస్తున్నారు.  ఇక  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం అయితే చెప్పనే  అక్కరలేదు. రాష్ట్రంలో ఇక చేసేందుకు ఏమీ లేదనే నిర్ణయానికి ఎలా వచ్చారో ఏమో కానీ, దేశాన్ని ఉద్దరించేందుకు  సిద్ద మయ్యారు. జాతీయ రాజకీయాల వెంట పడ్డారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే, రైతులకు ఎప్పుడో ఇవ్వవలసిన రైతు బంధు పైసలకు ఇంతవరకు దిక్కు లేదు. ఎక్కడన్నా, అప్పు పుడితేనే కానీ, రైతుల ఖాతాల్లో పైసలు పడవు. పోయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం అప్పుకు పోయినట్లు, తెలగాణ ప్రభుత్వం రైతు బంధు అప్పు కోసం పరుగులు తీస్తోంది.

ఇదొక్కటని కాదు,  రాష్ట్రంలో కాదు, ఏ దిక్కు చుసిన అష్టమ దిక్కే కనిపిపిస్తోంది. శాంతి భద్రతలు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నాయో, వేరే చెప్పనక్కరలేదు. మరో వంక అప్పులు, అవినీతి సమాంతరంగా ఉర్ద్వ ముఖ ప్రయాణం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అయినా, జగన్ రెడ్డి కి ఏమాత్రం తీసి పోకుండా, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు మావే అంటున్నారు కేసీఆర్.  అవును నిన్న మొన్నటి దాకా , ఉద్ధవ్‌ ఠాక్రే’ కూడా ఇలాగే, అహంకారం చూపారు. జగన్, కేసీఆర్  అయినా మరొకరు అయినా అందుకు అతీతులు కాదు, కదా...

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.