Publish Date:Nov 19, 2024
అత్యంత కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం (నవంబర్ 20) ఉదయం ఆరంభమంది. ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడీ బరిలో ఉన్నాయి. హోరాహోరీ పోరుతప్పదన్న అంచనాల నేపథ్యంలో మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వం ఎవరిదన్న విషయాన్ని ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. 288 నియోజకవర్గాలకు గాను మొత్తం 4, 136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా 2,086 మంది ఇండిపెండెంట్లు కావడం విశేషం.
గత ఎన్నికలలో 2019లో 3,239 మంది అభ్యర్థులు పోటీ చేయగా... ఈసారి అభ్యర్థుల సంఖ్య ఏకంగా 28 శాతం పెరిగింది. ప్రధాన పోటీ దారులైన రెండు కూటములూ కేడా రెబల్స్ బెడద ఎదుర్కొంటున్నాయి. సగానికి పైగా నియోజకవర్గాలలో రెబల్స్ బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా తాము ఆశించిన విధంగా పార్టీ టికెట్ దక్కని నేతలు రెబల్స్ గా బరిలోకి దిగారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండడంతో ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశ రాజధాని నగరం ముంబైలో అయితే ఏకంగా 30,000 మందిని భద్రత విధుల్లో నియోగించారు.
ఇలా ఉండగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కూడా సోమవారమే జరుగుతోంది. ఈ విడతలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, ఆయన సతీమణి కల్పనా సొరేన్, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-assembly-elections-poling-underway-25-188664.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.