కడపలో తెలుగుదేశం మహానాడు.. అసలీ ఆలోచన ఎవరిదో తెలుసా?

Publish Date:May 27, 2025

Advertisement

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఆ పార్టీ పెద్ద పండుగ మహానాడును కడపలో నిర్వహిస్తున్నారు. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు గురువారం (మే 28) వరకూ సాగుతుంది. కడప అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. దశాబ్దాలుగా కడప వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా నిలుస్తోంది. పార్టీలూ, హవాలతో సంబంధం లేకుండా కడప వైఎస్ కు అండగా నిలుస్తూ వస్తున్నది. వైఎస్ మరణానంతరం కడప జగన్ కు కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజిత రాష్ట్రంలో కూడా గత ఏడాది జరిగిన ఎన్నికల వరకూ కడపలో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే ఆ అధిపత్యానికి 2024 ఎన్నికలలో గండి పడింది. కడపలోని పది నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి విజయఢంకా మోగించింది. వైసీపీ కేవలం మూడంటే మూడు స్థానాలకు పడిపోయింది.

అయితే ఇంత కంటే ముందే కడపలో జగన్ కోటకు బీటలు వారడం మొదలైంది. అందకు బీజం లోకేష్ పాదయాత్రతో పడిందని చెప్పవచ్చు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా  రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంగానే జగన్ కడపకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలలో నభూతో అన్న స్థాయిలో విజయాన్ని అందుకున్న తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టంది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కడపలో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేశారు. వేస్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో ఇంధన, ఆటోమొబైల్ ప్రాజెక్టుల స్థాపన కేసం విశేష కృషి చేసి సాధించారు. వీటికి అదనంగా సాగునీటి ప్రాజెక్టులూ చేపట్టారు. దీంతో సీమ జీవన ముఖ చిత్రం మొత్తం మారిపోయే పరిస్థితికి వచ్చింది. జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాల కారణంగా జనం తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ మెగా ఈవెంట్ గా చెప్పబడే మహానాడును కడపలో నిర్వహించాలని నారా లోకేష్ ప్రతిపాదించారు. నారా లోకేష్ ప్రతిపాదనకు పార్టీ అధినేత చంద్రబాబు సహా మొత్తం క్యాడర్, లీడర్ ఆమోదముద్ర వేసింది. మహానాడు నిర్వహణతో కడప జిల్లాలో తెలుగుదేశం పట్టు పెంచుకుని బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని లోకేష్ గట్టిగా వాదించారు. కడపలో మహానాడు నిర్వహణ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కడపలో మహానాడు నిర్వహణతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో మెండుగా ఉంది. లోకేష్ ముందు చూపునూ, వైసీపీ కంచుకోటనే ఢీ కొని బీటలు వారేలా చేయడంలో ఆయన చూపిన ధైర్యం ఇప్పుడు కార్యకర్తల మన్ననలు అందుకుంటోంది. 

By
en-us Political News

  
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.