సడలుతున్న నాగం ధీమా
Publish Date:Mar 13, 2012
Advertisement
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి ధీమా ఇటీవల కాస్త సడలినట్లు కనిపిస్తోంది. నాగంజనార్ధనరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పటికి ఆయనకు టిఆర్ఎస్ మద్దతునైతే ప్రకటించింది కాని ఆ పార్టీ నాయకులెవరూ మనస్పూర్తిగా నాగం వెంట ప్రచారంలో తిరగడం లేదనే అపవాదులను ఎదుర్కొంటున్నారు . దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తెలాంగాణ వాదం కాస్త బలహీనపడింది ఇది నాగం వర్గీయులకు ఆందోళన కలిగిస్తోంది . గతంలో టిడిపి తరుపున గెలుపొందిన నాగం ఇప్పుడు స్వతంత్ర అభ్యర్దిగా రంగంలో ఉన్నారు. టిడిపి తరుపున మర్రి జనార్దనరెడ్డి పోటిచేస్తుంన్నారు . దీనివల్ల నాగం జనార్దనరెడ్డి కి వచ్చే ఓట్లలో కొన్ని మర్రి జనార్దనరెడ్డి చీల్చు కునే అవకాశం ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంది . ఈ నియోజకవర్గంలో కాంగ్రస్ పార్టీ కి 55వేలనుంచి 60వేల ఓట్ల వరకు పోలవుతూ వస్తున్నాయి . ఇప్పుడు నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటిచేస్తున్న కూచూపుళ్ళ దామోదర్ రెడ్డి గత ఎన్నికలో నాగ జనార్దనరెడ్డి పై 6,500ఓట్ల తేడాతో ఓడిపోయారు . 2004ఎన్నికల్లో కూచూపుళ్ళ కేవలం 1500ఓట్ల తేడాతో ఓడిపోయారు . ఈ రెండు ఎన్నికలో ఆయనకు మొదటిసారి 55వేలు ,రెండో సారి 60వేల ఓట్లు పొలయ్యా యి .ఈ సారి పరిస్తితి మరింత మేరుగువుతుం దని దామోదర్ రెడ్డి వర్గియులు అంచనా వేస్తున్నారు .
http://www.teluguone.com/news/content/mahabubnagar-24-12593.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





