Publish Date:Oct 23, 2025
మొన్నటి వరకూ అందరూ సునీత మాత్రమే మాగంటి గోపీనాథ భార్య. ఆమె పిల్లలు మాత్రమే ఆయనకు వారసులు. ఇదొక చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. అనుకుంటున్నారంతా. ఇంతలో సడెన్ ఎంట్రీ ఇచ్చాడు తారక్ ప్రద్యుమ్న. తానే అసలైన వారసుడిననీ, తనకు చట్టరీత్యా రావల్సిన ఈ హక్కు తన తండ్రితో లివిన్ రిలేషన్లో ఉన్న సునీతకు ఎలా ఇచ్చారంటూ.. ఈసీకీ ఫిర్యాదు చేయడంతో ఇంటి గుట్టు- రాజకీయం రట్టుగా మారింది.
సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందే సెంటిమెంటు ద్వారా నాలుగు ఓట్లు పడతాయని. ఇపుడీ మొదటి భార్య కొడుకు కారణంగా బీఆర్ఎస్ ఆశలపై భారీగా నీళ్లు జల్లినట్టయ్యింది. అయితే మాగంటి గోపీనాథ్ చనిపోయినపుడు తలకొరివి పెట్టడానికి కానీ, ఆ తర్వాత ఆయన నివాళి సభలకు కానీ రాని తారక్ ప్రద్యుమ్న సడెన్ గా తాను గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కొడుకును, ఆయన అసలు సిసలు రాజకీయ వారసుడ్నిఅంటూ రావడంతో అంతా ఉలిక్కి పడ్డారు. సునీత తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించి గోపీనాథ్ భార్యగా నిరూపించే యత్నం చేశారు. అక్టోబర్ 11న ఆ సర్టిఫికేట్ ని ఆర్డీఓ ఆఫీసు వారు కూడా రద్దు చేశారంటూ నానా యాగీ చేస్తున్న ఇతడిచ్చిన కంప్లయింట్ పై సునీత ఈసీకి వివరణ ఇస్తారు. అంతా బావుంది. మరి ఇప్పుడే ఇతడెందుకిలా బయటకొచ్చినట్టు? ఇతడి వెనక ఎవరున్నట్టు? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.
అయితే ఇతడు మాగంటి ఇంటి పేరును కూడా తన పేరు చివర వాడటం లేదనీ.. కొసరాజు తారక్ ప్రద్యుమ్న అనే పేరుతో చెలామణీ అవుతున్నాడనీ.. తండ్రి చివరి సారి చూపులకు కూడా రాని ఇతడు.. ఇప్పుడే సడెన్ గా ఊడి పడ్డం వెనక కాంగ్రెస్ మార్క్ రాజకీయ కుట్ర కోణం ఉందనీ.. అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అయితే ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్ భార్య అవునా కాదా? లివిన్ లో మాత్రమే ఉన్న జీవిత భాగస్వామా?
వంటివి పెద్దగా అడ్డంకులు కావు. ఎందుకంటే ఈ దిశగా చట్టాలు మారి చాలా కాలమే అయ్యింది. ఎలిజిబిటిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బట్టిచూస్తే ఆడ, మగ తేడా లేకుండా ఎవరు ఎవరితోనైనా ఉండొచ్చు. సంచరించొచ్చు. సహజీవన భాగస్వామ్యం కొనసాగించవచ్చు. అయితే సునీత తప్పుడు ధృవీకరణ పత్రాలే అసలు సమస్య. ఇప్పటికే సునీత నామినేషన్ల సెట్ ఓకే చేసీన ఈసీ ఈ ఫిర్యాదు ద్వారా ఎలాంటి నిర్ణయం తీస్కుంటారన్న సస్పెన్స్ నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maganti-sunitha-facec-stepsibling-fight-39-208348.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.