జూబ్లీ కాంగ్రెస్ బరిలో మిగిలింది ముగ్గురే?
Publish Date:Oct 5, 2025
Advertisement
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్ధుల జాబితాలో నవీన్యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను ఇన్చార్జ్ మంత్రులు షార్ట్లిస్ట్ చేశారు. ఇన్చార్జ్ మంత్రులు షార్ట్లిస్ట్ ఫైనల్ చేశారు. అనంతరం స్కీనింగ్ కమిటీకి ఈ జాబితాను టీపీసీసీకి పంపనుంది. ఇదిలా ఉంటే మొదటి నుంచి జూబ్లీహిల్స్ బైపోల్ లో పోటీలో బరిలొ ఉండబోతున్నట్లు ప్రచారం చేసుకున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు షార్ట్ లిస్టులో లేకపోవడం ఆయనకు షాక్ ఇచ్చినట్లైంది. తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపిక కోసం కమలం పార్టీ పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. మరోవైపు బీజేపీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, కిలారీ మనోహర్ టికెట్ ఆశిస్తున్నారు. మరోసారి తెరమీదకు వచ్చిన అజారుద్దీన్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్ పోటీలో ఎలగైన నిలవాలని పోటీలో భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీ నేతలతో అజార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనను బరిలో నుంచి తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించాడు అని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి పేరుతో పక్కకి తప్పించే కుట్ర జరుగుతుందని ఆయన వాపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు రంగంలో దిగారు.
http://www.teluguone.com/news/content/maganti-gopinath-39-207382.html





