జూబ్లీలో ఉప ఎన్నికలో.. కూటమి పోటీ?
Publish Date:Jul 4, 2025
Advertisement
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. నిజానికి, ఉప ఎన్నిక ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. కానీ, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మాత్రం అప్పుడే మొదలైంది. ప్రధానంగా, ఆధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ కూడా బరిలో దిగేందుకు రెడీ అవుతున్న నేపధ్యంలో సహజంగానే నియోజక వర్గం, అందరి దృష్టిని, మరీ ముఖ్యంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదాల ఉంటే. జూబ్లీహిల్స్’ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పునుందా? రాజకీయ సమీకరణలను మార్చివేస్తుందా, కొత్త పొత్తులకు తెర తీస్తుందా,? రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా? ఇలా అనేక కోణాల్లో, అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏమి జరిగిన ఏమి జరగక పోయినా,జూబ్లీ ఉప ఎన్నికరాజకీయ ఊహాలకు,వ్యూహాగానాలకు వేదిక అవుతుందనిపిస్తోందని అంటున్నారు. నిజానికి ఇప్పటికే, అనేక ఉహాలు, వ్యూహాగానాలు సోషల్ మీడియా మొదలు మెయిన్’ స్ట్రీమ్’ మీడియా వరకు కథలు కథలుగా చక్కర్లు కొడుతన్నాయి. అయితే, ఈ ఉహాలను, వ్యూహాగానాలను పూర్తిగా కొట్టివేయడం కుదరదని,, రాజకీయ పండితులు అంటున్నారు. అవును,ఉప ఎన్నిక జరుగుతున్నది, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గం కాకుండా మరో నియోజక వర్గం అయితే, ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత దృష్టా, తెలంగాణలోనే కాకుండా,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ జూబ్లీ ఉప ఎన్నిక గురించిన చర్చ జరుగుతోంది. ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నియోజక వర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే,అందులో ఒకొంతు ఓటర్లకు కొంచెం అటూ ఇటుగా, ఆంధ్రా మూలాలున్న, సెట్ల్లెర్స్’ ఉన్నారు.అఫ్కోర్స్,అంతకంటే ఎక్కువగా, ఒక లక్షా 20 వేల వరకు ముస్లిం, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అయినా జూబ్లీ నియోజక వర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించేది, సెట్లర్’ ఓటర్లే అంటారు. అదొకటి అయితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన, తెలంగాణ తొలి శాసన సభ ఎన్నికల్లోనూ జూబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్’ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్’లో చేరినా, వరసగా 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది మాత్రం సెట్లర్స్’ ఓట్లే అంటారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రీ-ఎంట్రీకి ప్రయత్నిస్తునట్లు చెపుతున్న,తెలుగు దేశం పార్టీ, జూబ్లీ ఉప ఎన్నికను లాంచింగ్ ప్యాడ్’ చేసుకుంటుందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లో,జనసేన మద్దతుతో పోటీచేసిన బీజేపీ, టీడీపీ కూటమి,20 అసెంబ్లీ స్థానాలు( టీడీపీ 15, బీజేపీ 5) గెలుచు కుంది. 2018లో కాంగ్రెస్’ జట్టుకట్టి పోటీచేసినా టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తెలంగాణలో పోటీచేయలేదు. అయితే,ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, టీడీపీ తెలంగాణలో తిరిగి కాలు మోపేందుకు సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్’ లో సక్సెస్ అయిన, టీడీపీ. జనసేన, బీజేపీ కూటమి ఫార్ములాను తెలంగాణాలో కొనసాగించాలని కూటమి నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ ఉప ఎన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే, కూటమి తరపున, ఏపార్టీ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/maganti-gopinath-25-201288.html





