చిన్నారి అంత్యక్రియలకు ముందే హంతకుడు మృతి
Publish Date:Feb 18, 2026
Advertisement
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఆమె స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో నిర్వహించారు. కడసారి వీడ్కోలకి బంధువులు, స్థానికులు, అన్నమయ్య, కడప జిల్లాల టీడీపీ నేతలు హాజరయ్యారు. అందరూ కన్నీటితో బాలికకు ఆఖరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు ముందే, ఈ కేసులో నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. అన్నమయ్య జిల్లా కరసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడి మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పరారైన కులవర్ధన్ బాలిక అంత్యక్రియలకు ముందే మరణించడంపై మృతురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత మాట్లాడుతు చిన్నారిపై ఘాతుకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని అన్నారు. నిందితుడు కులవర్ధన్ గంజాయికి అలవాటు పడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని హోంమంత్రి తెలిపారు. నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడని.. ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా కనసానివారిపల్లె చెరువులో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైందని ఎస్పీ ధీరజ్ తెలిపారు. మదనపల్లి చిన్నారిపై నిందితుడు ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ ఆసక్తికర పోస్ట్ చేసింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే సీఎం చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.
http://www.teluguone.com/news/content/madanapalle-brutal-incident-36-214299.html





