నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నేత సీఎం రమేష్ రహస్యాలన్నీ బయట పెట్టేశారు.. అవి మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్, సహా పలు కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అరెస్టు తప్పదన్న ప్రచారమూ జోరుగా ఉంది. అంతే కాకుండా అన్ని కేసుల దర్యాప్తులూ చివరి దశకుచేరుకుంటున్నాయి. రీసెంట్ గా కాళేశ్వరం కర్త- కర్మ- క్రియ అన్నీ కేసీఆరే అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదికను ఉటంకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రముఖంగా ప్రచురించింది. ఇలా అన్ని ఇబ్బందులూ, కష్టాలూ ఏకకాలంలో చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇక్కడే ఉంటే అవమాన భారం తప్పదన్న భావనతో కేటీఆర్ విదేశాలకు పోదాం అన్న ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికే కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ ముందు యూఎస్, యూకే, దుబాయ్ వంటి ఆప్షన్లు ప్రతిపాదించారట ఇంత చేశారు. సంపాదించారు. వాటిని లక్కీభాస్కర్ సినిమాలో ఆ హీరో లాఎస్కేపై సేఫ్ గా ఉందామన్నదే కేసీఆర్ ప్రతిపాదనగా చెబుతున్నారు. అయినా ఇదేమైనా జరగనిదా? గతంలో బ్రిటీషర్లు కూడా అంతేగా.. 3 లక్షల కోట్ల మేర పడవల్లో సర్దేసుకుని మన సంపదతో ఉడాయించారు. వాళ్లేమైనా మనలాగా రాష్ట్ర సాధన చేశారా? మన దేశమే మనికిచ్చి వెళ్లిపోయారు. అదే మనం రాష్ట్రాన్ని సాధించాం. ఎప్పటికీ మీరే సీఎంగా ఉంటారని నమ్మాం. కానీ జనం కాంగ్రెస్ కి అధికారమిచ్చి మనకు జలక్ ఇచ్చారు. అలాంటి జనానికి మనమూ ఓ జర్క్ ఇద్దాం. దానికి తోడు ఇదేమైనా కొత్తా.. మొన్నటికి మొన్న మనకన్నా ముందే ప్రభాకర్ రావు యూఎస్ చెక్కేయలేదూ.. మనమూ అలాగే వెళ్లిపోదాం అన్నది కేటీఆర్ వాదనట.
అంతా బాగుంది కానీ ఇంత బతుకు బతికి అక్కడెక్కడో దేశం గాని దేశానికెళ్లి సెటిలవడమేంటన్నది కేసీఆర్ అభ్యంతరమట. ఇక్కడే ఉందాం... నేనుండే వరకూ నన్ను వేధిస్తారు. ఆ తర్వాత అంతా మరచి పోతారు. నువ్వు నీ కుటుంబం, నీ చెల్లి బావ, ఇతర బంధుమిత్రులు హ్యాపీగా బతకొచ్చు. కాబట్టి ఏం నారాజ్ కావద్దని కేసీఆర్ కేటీఆర్ ను సముదాయిస్లున్నారట. మరి ఈ అటలో ఎంత వరకూ వాస్తవం ఉందో.. కేసీఆర్ జైలుకెళ్తారా? ఆ అవమాన భారాన్ని మోస్తారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/luckey-bhasker-scheme-in-brs-25-203407.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.