సీఎస్ సోమేష్ కుమార్ కు ఉద్వాసన తప్పదా? ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ ఏరి కోరి తెచ్చుకున్న సోమేష్ కుమార్ ఇప్పుడు ఆయన నమ్మకాన్ని కోల్పోయారా? అంటే అధికార వర్గాల్లో ప్రచారం మేరకు ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తే అయినప్పటికీ సోమేష్ కుమార్ క్యాట్ ఆర్డర్స్ మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వ్యవహార శైలి సీఎంకు పెద్దగా నచ్చుతున్నట్లు కనబడదు. అంతే కాకుండా సీఎంలు, చీఫ్ జస్టిస్ ల సదస్సులో సీఎస్ సోమేష్ వ్యవహార శైలిపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. సీఎం కేసీఆర్ ఆయనకు ఉద్వాసన పలకడమే మేలని నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారమౌతోంది. విధి నిర్వహణలో సీఎస్ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎం స్వయంగా చెప్పన అంశాల అమలులో కూడా అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం సీఎస్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఎంతో నమ్మకంతో డజను మంది సీనియర్లను సైతం తోసి రాజని ఏరి కోరి సోమేష్ కుమార్ ను సీఎస్ గా సీఎం కేసీఆర్ తెచ్చుకున్నారు. సీనియారిటీ లేని వ్యక్తికి సీఎస్ పదవి ఏమిటని రేవంత్ వంటి ప్రతిపక్షాల నేతలు ఎన్ని మార్లు ఆరోపణలు, విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ ఖాతరు చేయలేదు. అయితే ఇప్పుడు సీఎస్ వ్యవహార శైలి పట్ల స్వయంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సీఎస్ వ్యవహారశైలి, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాని సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సీజేఐ సీఎస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ఉద్వాసన చెప్పక తప్పదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణారావుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lost-confidence-in-somesh-will-co-oost-cs-somesh-25-135399.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.