రెడ్‌బుక్‌ చాప్టర్3లో ముగ్గురి పేర్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశి.. మూడో వ్యక్తి ఎవరు?

Publish Date:Nov 2, 2024

Advertisement

రెడ్‌బుక్‌.. ఈ పేరు వింటేనే. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది.  మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లా స్థాయి వైసీపీ నేతల వరకు అందరిలోనూ ఎప్పుడు ఎవరు జైలు కెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. వైసీపీ ఐదేళ్ల హయాంలో నిబంధనలు తుంగలో తొక్కి కొందరు అధికారులు, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు పలువురిని జైళ్లకు పంపించి చిత్రహింసలకు గురిచేశారు. కొందరు వైసీపీ నేతలు ఏకంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనా దాడులు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ప్రతిపక్షంలోఉన్న సమయంలో నారా లోకేశ్ ‘రెడ్‌బుక్‌’లో నమోదు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని వదిలిపెట్టేది లేదని, ఒక్కొక్కరిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే, అప్పట్లో వైసీపీ నేతలు రెడ్‌బుక్‌పై వెటకారంగా మాట్లాడారు. కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్‌ పేరు వింటేనే వైసీపీ భయంతో వణికి పోతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేశారు. రెడ్‌బుక్‌లో నమోదు చేసుకున్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే రెడ్‌బుక్‌ ప్రభావం కనిపించడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఢిల్లీకివెళ్లి ఆందోళనకు దిగారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ స్వయంగా జగన్ గగ్గోలు పెట్టాడు.  అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ ‘రెడ్‌బుక్‌’ అంటుంటే నవ్వుకున్న జగన్.. అధికారం కోల్పోయిన తరువాత రెడ్‌బుక్‌ అంటేనే వణికిపోతున్న పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం శ్రేణులను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలా మందిపై ఇప్పటికే రెడ్‌బుక్‌ ఛాప్టర్1, ఛాప్టర్2 ఓపెన్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఛాప్టర్1లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేసి జైళ్లకు పంపించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై విచారణలు జరుగుతుండగా.. కొందరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. మరి కొందరిని సస్పెండ్ చేశారు. రెడ్‌బుక్‌ ఛాప్టర్2లో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు మొదలు పెట్టారు. అదే విధంగా అధికార మదంతో చంద్రబాబు, పవన్, లోకేశ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు జైలు కెళ్లగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లోకేశ్   తాజాగా‘రెడ్‌బుక్‌’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఛాప్టర్3లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

మంత్రి నారా లోకేశ్ వారం రోజులు అమెరికాలో పర్యటించారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.    రెండు రోజుల కిందట అమెరికాలోని అట్లాస్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ రెడ్‌బుక్‌ గురించి ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని అన్నారు. అయితే, రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్ట పడాలని లోకేశ్ సూచించారు. దీంతో ఛాప్టర్3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉండబోతున్నాయని లోకేశ్ చెప్పకనే చెప్పారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు నందమూరి, చంద్రబాబు కుటుంబాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వంశీపై తెలుగుదేశం శ్రేణులే కాదు,   ప్రజలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్దం కేసులో వంశీపై కేసు నమోదైంది. త్వరలో వంశీపై అంతకన్నా తీవ్రమైన కేసులు నమోదు కాబోతున్నాయని, జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ చెప్పకనే చెప్పారంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 

రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో కొడాలి నాని పేరుకూడా ఉంటుందని లోకేశ్ హింట్ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. చంద్రబాబును ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషించాడు. పవన్ కల్యాణ్, లోకేష్ పైనా అనేక సార్లు నోరుపారేసుకున్నాడు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండాలి నాని, వల్లభనేని వంశీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాప్టర్ -3లో నాని, వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

వీరిద్దరితో పాటు మరో వైసీపీ ముఖ్యనేత పేరుకూడా రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో ఉందని ప్రచారం జరుగుతుంది. అతను జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి వ్యక్తి అని, అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. త్వరలో మరో కేసు నమోదు కాబోతుందని, ఆ కేసులో సదరు వ్యక్తి జైలు కెళ్లడం ఖాయమని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రెడ్ బుక్ ఛాప్టర్ -3 అనగానే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందట. మొత్తానికి రెడ్ బుక్ అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎగతాళిగా మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా లోకేశ్ రెడ్ బుక్ పేరు ప్రస్తావించడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.