లోకేష్, పవన్ భేటీ.. వైసీపీకి లోన వణుకు.. పైకి మేకపోతు గాంభీర్యం!

Publish Date:Oct 24, 2023

Advertisement

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచినప్పటికీ.. తెలుగుదేశం పార్టీలో జోష్ ఇసుమంతైనా తగ్గలేదు. సరికదా.. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ పతనమే లక్ష్యంగా మరింత దృఢసంకల్పంతో  కేడర్ ముందుకు సాగుతున్నది.  అతెలుగుదేశం క్యాడర్ లోనే కాదు.. తటస్థులు, సామాన్య జనంలో కూడా ఇదే భావన వ్యక్తం అవుతోంది.   మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించి  జనంలో కొత్త జోష్ నింపారు. అయితే జనసేనాని తెలుగుదేశంతోనే కలిసి వెడతామని ప్రకటించి 45 రోజులైనా.. ఆ దిశగా రెండు పార్టీల మధ్యా  ఉమ్మడి కార్యాచరణ దిశగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో జనం ఒకింత అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. అసలు పొత్తు ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ అసహనానికీ, అనుమానాలకీ తెర దించుతూ రెండు పార్టీల పెద్దలు కలిసి ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. రాజమండ్రి మంజీరా హోటల్‌ వేదికగా సోమవారం (అక్టోబర్  23)న జరిగిన భేటీలో టీడీపీ, జనసేన నేతలు సమన్వయ కమిటీ సభ్యులతో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరిపారు.

సమన్వయ కమిటీలలో ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల సమన్వయ కమిటీలతో  నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించారు. గ్రామీణ స్థాయిలో పార్టీల బలోపేతం, ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలు, క్షేత్రస్థాయికి పొత్తు అంశాన్ని బలంగా తీసుకెళ్లడంపై చర్చించారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహించిన తొలి సమావేశం ఇదే .   45 రోజులుగా చంద్రబాబు నిర్బంధంలో ఉన్న రాజమహేంద్రవరంమే రెండు పార్టీల భేటీకి అక్కడే వేదిక కావడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు. ముందుగా నారా లోకేష్ రాజమండ్రి తెలుగుదేశం క్యాంపు కార్యాలయంలో పార్టీ  సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కళ్యాణ్ తో  భేటీ అయ్యారు.  

కాగా, సమన్వయ కమిటీలతో భేటీ అయ్యాక నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతకు ముందే  సోమవారం (అక్టోబర్ 10) ఉదయమే  నారా లోకేష్ చంద్రబాబును ములాఖత్ లో కలిసి చర్చించారు.. పలు అంశాలపై సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ భేటీ.. అనంతరం పవన్-లోకేష్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పవన్, లోకేష్ భేటీతో తెలుగుదేశం, జనసేన నాయకులలో జోష్ పెరిగింది. అంతకు మించి  వైసీపీ నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన పెరిగిపోయింది. ఈ సమావేశంతో  ఏపీ రాజకీయాలలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇరు పార్టీలూ వేరువేరుగా అంటే పొత్తు లేకుండా ఉన్నసమసయంలోనే వైసీపీ పట్ల వ్యతిరేకత పీక్స్ లో ఉంది. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. గుడ్డిలో మెల్ల అన్నట్లుగానైనా గెలుస్తామన్న ఆశ వైసీపీలో మిణుకు మిణుకు మంటుండేది. అయితే   రెండు పార్టీలూ కలిసి రంగంలోకి దిగితే.. సోదిలోకి కూడా మిగలం అన్న ఆందోళనతోనే వైసీపీ నేతలు ఇరు పార్టీల మధ్యా పొత్తు లేకుండా చేయడానికి నానా విధాలుగా  ప్రయత్నించారు. ఒంటరి పోరు.. దమ్ము అంటూ సవాళ్లు విసిరారు. అయితే ఇరు పార్టీలూ జగన్ ను గద్దెదించాలన్న ప్రజల ఆకాంక్షను సాకారం చేయడమే లక్ష్యం అంటూ కలిసే పోటీలో దిగడానికి సిద్ధం అవ్వడంతో  వైసీపీ వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు.  

ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ  నాదశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ  తెలుగుదేశం. క్షేత్రస్థాయి నుండి బూత్ స్థాయి వరకూ నాయకత్వం, నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదార్శనికుడు, దార్శనికుడు చంద్రబాబు సారధ్యంలో సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలచుకోవడం అలవాటుగా మార్చుకున్న పార్టీ తెలుగుదేశం. ఇక పవన్ కళ్యాణ్ కున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, సినీ గ్లామర్ జనసేనకు ప్రధాన ఆకర్షణ. అన్నిటికీ మించి ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, వ్యతిరేకత, ప్రజాగ్రహం కూడా తోడై ఈసారి వైసీపీకి ఘోర పరాజయం తప్పదేనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. వాళ్లలోనూ, వీళ్లలోనూ కాదు.. ఏకంగా వైసీపీ శ్రేణులలోనే ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు, మంత్రులూ కూడా అంతర్గత సంభాషణల్లో, తమ అనుచరులతో భేటీలలో ఈ విషయాన్నే చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరిగిన లోకేష్, పవన్ భేటీ  వైసీపీలో అలజడి పెరిగింది. భయం మొదలైంది. ఇప్పటికే సర్వేల ఫలితాలను, ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్నీ చూసిన వైసీపీ నేతలకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది.  పైకి మేకపోతు గాంభీర్యం పదర్శిస్తున్నా ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి సహా.. వైసీపీ పెద్దలను కూడా  తెలుగుదేశం, జనసేన పొత్తు కలవరపెడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.