శరణమా? న్యాయసమరమా?.. తేల్చుకో జగన్.. లోకేష్ మాస్ వార్నింగ్

Publish Date:Jun 14, 2025

Advertisement

గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఆవిర్భావం నుంచీ కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి, తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన సంగతి తెలిసిందే.   ముందు కూడా తిరుమలలో పింక్ డైమండ్ అంటూ వైసీపీయులు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విచారణలో అసలు శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండే లేదని తేలింది. అలాగే బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి దాడి.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై బురద జల్లడం ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. 

అయితే.. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు చేసి ప్యాలెస్ లో దాక్కుంటానంటే కుదరదని కుండ బద్లలు కొట్టేశారు. తాజాగా తల్లికి వందనం పథకంలో రెండు వేల రూపాయల విమనహాయింపుపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండిస్తూ.. నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కోరి శరణు జొచ్చుతావా.. న్యాయ సమరానికి రెడీ అవుతావో తేల్చుకో జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.   

 తల్లికి వందనం డబ్బులుతన జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలంటూ లోకేష్ సవాల్ కు జగన్ నుంచి సౌండ్ లేకపోయే సరికి మరోసారి ట్విట్టర్ వేదికగా లోకేష్ జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. తాను ఇచ్చిన 24 గంటల గడువు ముగిసిపోయినా.. జగన్ నుంచి సౌండ్ లేదనీ, అందుకే ఆయనను ఫేక్ జగన్ అంటున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు.  సమయం లేదు మిత్రమా శరణమా, న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ అల్టిమేటమ్ జారీ చేశారు.   లోకేష్ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.     

అంతే కాదు నారా లోకేష్ ఏ విషయాన్నీ అంత తేలికగా వదిలేరకం కాదని వైసీపీకి బాగా తెలుసు. గతంలో చినబాబు చిరుతిండి అనే శీర్షికతో జగన్ సొంత మీడియాలో ప్రచురితమైన వార్త విషయంలో లోకేష్ చేస్తున్న న్యాయపోరాటం.. ఆ మీడియాను, వైసీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్పుడు తల్లికి వందనం కేసులో వైసీపీ, జగన్ ఇష్టారీతిగా చేసిన ఆరోపణల విషయంలో లోకేష్ శరణమా, న్యాయ సమరమా అని అల్టిమేటం ఇవ్వడంతో వైసీపీలో వణుకు మొదలైందంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.