Publish Date:Jun 14, 2025
గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఆవిర్భావం నుంచీ కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి, తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన సంగతి తెలిసిందే. ముందు కూడా తిరుమలలో పింక్ డైమండ్ అంటూ వైసీపీయులు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విచారణలో అసలు శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండే లేదని తేలింది. అలాగే బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి దాడి.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై బురద జల్లడం ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది.
అయితే.. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు చేసి ప్యాలెస్ లో దాక్కుంటానంటే కుదరదని కుండ బద్లలు కొట్టేశారు. తాజాగా తల్లికి వందనం పథకంలో రెండు వేల రూపాయల విమనహాయింపుపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండిస్తూ.. నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కోరి శరణు జొచ్చుతావా.. న్యాయ సమరానికి రెడీ అవుతావో తేల్చుకో జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తల్లికి వందనం డబ్బులుతన జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలంటూ లోకేష్ సవాల్ కు జగన్ నుంచి సౌండ్ లేకపోయే సరికి మరోసారి ట్విట్టర్ వేదికగా లోకేష్ జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. తాను ఇచ్చిన 24 గంటల గడువు ముగిసిపోయినా.. జగన్ నుంచి సౌండ్ లేదనీ, అందుకే ఆయనను ఫేక్ జగన్ అంటున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు. సమయం లేదు మిత్రమా శరణమా, న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ అల్టిమేటమ్ జారీ చేశారు. లోకేష్ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అంతే కాదు నారా లోకేష్ ఏ విషయాన్నీ అంత తేలికగా వదిలేరకం కాదని వైసీపీకి బాగా తెలుసు. గతంలో చినబాబు చిరుతిండి అనే శీర్షికతో జగన్ సొంత మీడియాలో ప్రచురితమైన వార్త విషయంలో లోకేష్ చేస్తున్న న్యాయపోరాటం.. ఆ మీడియాను, వైసీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్పుడు తల్లికి వందనం కేసులో వైసీపీ, జగన్ ఇష్టారీతిగా చేసిన ఆరోపణల విషయంలో లోకేష్ శరణమా, న్యాయ సమరమా అని అల్టిమేటం ఇవ్వడంతో వైసీపీలో వణుకు మొదలైందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-mass-warning-to-jagan-39-199964.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.