మంగళగిరిలో లోకేష్ మ్యాజిక్!.. అనుమానం లేదు విజయం చినబాబుదే!

Publish Date:Mar 19, 2024

Advertisement

మంగళగిరి.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీలో హాట్ సీట్ అనడంలో సందేహం లేదు. ఔను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టీ మంగళగిరి నియోజకవర్గంపైనే ఉంది. 
నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలో  ఏ పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న చర్చ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు పార్టీల పరిస్థితి ఏమిటన్న ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ విజయం పక్కా అన్నదే అందరి భావన.  వాస్తవానికి మంగళగిరి ఎప్పడూ తెలుగుదేశం పార్టీకి ఫేవరెట్ సీటు కాదు. నియోజకవర్గం ఆవిర్భావం తరువాత.. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 1985 తరువాత మంగళగిరి నియోజవకర్గంలో తెలుగుదేశం గెలిచింది లేదు.  

అలాంటి అంటే తెలుగుదేశంకు అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గం నుంచి నారా లోకేష్   ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. అవును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం అధినేత తనయుడిగా గత ఎన్నికలలో లోకేష్ పోటీ చేయదలచుకుంటే పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాన్ని ఎన్నికుని పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. లోకేష్ మాత్రం సవాల్ స్వీకరించేందుకే మొగ్గు చూపారు. పార్టీకి అంతగా అనుకూలం కాని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నికుని ఆయన 2019 ఎన్నికలలో పోటీకి దిగారు. అలా దిగడం ద్వారా లోకేష్  ఎలాంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చాటారు. ఆ ఎన్నికలలో పరాజయం పాలైనా, వెనకడుగు వేయలేదు.  నియోజకవర్గాన్ని వదలలేదు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.  మామూలుగా అయితే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూసి, అక్కడ నుంచి ఒకసారి ఓటమి పాలై కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే టన్నలు కొద్దీ ధైర్యం ఉండాలి.  ప్రజలను ఆకట్టుకుని ఓడిన చోటే విజయకేతనం ఎగురవేయగలనన్న ధీమా ఉండాలి. మంగళగిరి నియోజకవర్గం నుంచే 2024 ఎన్నికలలో పోటీకి రెడీ అవ్వడం ద్వారా ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ రుజువు చేసుకున్నారు.   ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక లోకేష్ గత ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమైన తీరు గమనించిన పరిశీలకులు ఇప్పుడు తెలుగుదేశం గెలుపు గ్యారంటీ స్థానాలలో మంగళగిరిని మొదటి స్థానంలో చెబుతున్నారు.  గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.  

పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చి మూడో అభ్యర్థిని తెరపైకి తీసుకురావడాన్ని చూపుతున్నారు.  స్వయంగా వైసీపీ అధినేత జగన్  దృష్టి పెట్టి గెలుపు గుర్రాలంటూ ఒకరిని  కాదని మరొకరిని మంగళగిరి అభ్యర్థిగా మార్చి మార్చి ప్రకటిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆకాశమే హద్దుగా హామీలు గుప్పిస్తున్నా  ఇక్కడ వైసీపీ నుంచి వలసలు వరదల్లా పెరుగుతున్నాయి.  

మంగళగిరిని అగ్రస్థానంలో నిలపడమే  లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.  వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు సైతం  పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు.  జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన  వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. ఇక జనం అయితే ఎప్పుడో లోకేషే మా ఎమ్మెల్యే అన్న నిర్ణయానికి వచ్చేశారు.    అంతేనా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరేందుకు వస్తున్న వారి సంఖ్య  మేడారం జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు సైతం అంటున్నారంటే లోకేష్ నియోజకవర్గంపై ఎంతటి ప్రభావం చూపారో అర్ధం అవుతోంది.  

మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని  నారా లోకేష్  చెబుతున్న మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.  తండోపతండాలుగా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోవడానికి జనం తరలి వస్తున్నారు. ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరిలో వైసీపీకి క్యాడర్ మిగిలే అవకాశాలూ అనుమానమేనని అంటున్నారు.  అయినా లోకేష్ క్షణం విశ్రమించడం లేదు. తటస్థులను మర్యాదపూర్వకంగా కలుస్తూ,  మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన వద్ద ఉన్న ప్రణాళికను వివరిస్తున్నారు.   

తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజలంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని ఆయన చెబుతున్న మాటలు విశ్వసిస్తున్నారు.  పరిశీలకులు మంగళగిరిలో లోకేష్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాభిమాన్ని చూసి నియోజకవర్గంలో లోకేష్ మ్యాజిక్ చేశారని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.