బెస్ట్ లీడర్ నారా లోకేష్.. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే

Publish Date:Jul 27, 2023

Advertisement

ఏపీలో ఇప్పుడున్న ప్రథమ శ్రేణి రాజకీయ నేతలలో చంద్రబాబు అందరికంటే సీనియర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన స్టేచర్, అనుభవం, దార్శనికతతో సాటి రాగల నేత ఏపీలో ఆయన వినా మరొకరు ఇప్పుడు లేరని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.. ఇక, ఆయన తరువాత ఇప్పుడున్న నేతలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచు మించు సమకాలికులుగా చెప్పుకోవచ్చు. అందుకేఈ నేతలలో బెస్ట్ ఎవరన్నఅంశంపై తెలుగువన్  ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సినీ హీరోగా భారీ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను కాదని నెటిజన్లు నారా లోకేష్ కు ఓటేశారు. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో   నారా లోకేష్ ప్రజా నేతగా  అత్యధిక ఓట్లను దక్కించుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెస్ట్ లీడర్ గా అత్యధికులు నారా లోకేష్ కు ఓటేశారు. ఈ సర్వేలో నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అప్షన్లుగా ఇవ్వగా అత్యధిక శాతం మంది నారా లోకేష్ కు ఓటేశారు. బెస్ట్ లీడర్ గా నారా లోకేష్ కు 62 శాతం మంది ఓటేయగా.. 24 శాతం మంది పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ గా ఎన్నుకున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ లీడర్ అంటూ కేవలం 14 శాతం మంది మాత్రమే ఓటేశారు. తెలుగు వన్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో స్వల్ప వ్యవధిలో 53 వేల మంది నెటిజన్లు పాల్గొన్నారు. దీంతో నెటిజన్లలో నారా లోకేష్ పట్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిజిటల్ మీడియాను ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. అలాంటి వర్గంలో నారా లోకేష్ కరిష్మా ఏంటో ఈ సర్వే ద్వారా బయటపడుతుంది.

ఈ సర్వేలో నారా లోకేష్ పట్ల నెటిజన్లు చూపిన నమ్మకం వెనక ప్రస్తుతం ఆయన సాగిస్తున్న యువగళం పాదయాత్ర కూడా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ స్టామినా ఏంటో ఆంధ్ర ప్రజానీకానికి అర్థమైంది. అనితర సాధ్యం అనదగ్గ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర   ప్రారంభించిన లోకేష్.. జగన్ సర్కార్ గుక్కతిప్పుకోలేని విధంగా విమర్శల బాణాలను సంధిస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్రకు ముందు లోకేష్ వేరు.. ఇప్పుడు లోకేష్ వేరు అనేలా ఆయన పొలిటికల్ గా మేకోవర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను, అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ లోకేష్ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ సర్వే రూపంలో బయటపడిందని చెప్పవచ్చు.

అయితే, నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా   కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు. దానికి ఉల్లిక్కి పడని లోకేష్ ఇప్పుడు ఇలా పని తీరుతోనే సమాధానం చెప్పారు. ముందుగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టిన లోకేష్.. గర్జించే సింహంలా ఇప్పుడు ఇలా లక్షల మంది ప్రజా సైనికుల ముందు బెరుకు లేకుండా ప్రత్యర్థులను సూటిగా చీల్చి చెండాడుతున్నారు. మొత్తంగా ఇదీ మీ లోకేష్ అంటూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. దాని ఫలితమే ఈ ఆన్ లైన్ సర్వేలో నెటిజన్లు జయహో లోకేష్ అని మద్దతు తెలిపారని చెప్పడానికి సందేహం అవసరం లేదు.

By
en-us Political News

  
తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు.
గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.
ఆలస్యం అమృతం విషం అన్న నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే అది ఇదే. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన కేంద్ర నిధులు ఆగిపోతాయి. మురిగిపోతాయి.
సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా? కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది?
తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు.
అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
బంగారం తయారు చేస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నిందితుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ నాగపూర్ కు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతోంది.
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది వంటి అన్ని వివరాలతో కూడిన ప్రభుత్వం విడుదల చేసింది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలు రెండేళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.