రెడ్ బుక్ మరిచిపోలేదు.. అక్రమార్కులకు శిక్ష తప్పదు!

Publish Date:Jan 16, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ మయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల జగన్ పాలన అంతా అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ అన్నట్లుగా సాగింది.   ఆ పార్టీ నేత‌లు యధేచ్ఛగా అందినకాడికి ప్ర‌భుత్వ భూములు, అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జా  చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేశారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అదికారంలోకి వచ్చిన జగన్ తన హయంలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని నానా  రకాలుగా వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అన్ని విధాలుగా వేధింపులకు గురి చేశారు. సరే జనం జగన్ అరాచక పాలనకు ఛీ కొట్టి గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గత ఐదేళ్ల పాలనలో తాము ఎదుర్కొన్న వేధింపులు, మానసిక వేదనకు  న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కార్ జగన్ హయాంలో  జరిగిన అరాచకత్వం, అన్యాయం, దౌర్జన్యం, దోపిడీలపై చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం నేతలు, క్యాడర్ తో పాటు జగన్ హయాంలో వేధింపులకు గురైన జనసైనికులు కూడా ఆశించారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురి చేసింది.  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో  అవమానాలు, వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొన్న తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ కు జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు అన్న ఆశ ఈ ఆరు నెలలుగా అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. 

యువగళం పాదయాత్ర సందర్భంగా రెడ్ బుక్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ నిబంధనలను తుంగలోకి తొక్కి అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి పేర్లూ ఈ రెడ్ బుక్ లో నోట్ చేశాననీ, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనీ చెప్పిన లోకేష్ కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టారా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమౌతున్న పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో నారా లోకేష్ తాను రెడ్ బుక్ ను మరిచి పోలేదని ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా కుప్పంలో సంబరాలు చేసుకున్న ఆయన ఆ సందర్భంగా  కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ రెడ్ బుక్ లో  పేరున్న ప్రతి  ఒక్కరూ వారి పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సిందేననీ, అలా చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. తాను రెడ్ బుక్ ను మరిచిపోలేదనీ, అన్యాయాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదనీ, ఇప్పటికే రెడ్ బుక్ తన పని తానూ చేసుకుంటూ పోతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక మాఫియాలు నడిపిన వారు  త్వరలో  కటకటాలు లెక్కించడం తధ్యమన్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనలలో ఉత్సాహం నెలకొంది. రెడ్ బుక్ ను లోకేష్ మరిచి పోలేదనీ, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.