Publish Date:Dec 30, 2024
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో ఘనత సాధించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ను విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాయకీ లేని నియోజకవర్గంగా ముద్రపడిన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి సారి పరాజయం పాలైన లోకేష్.. పార్టీ అధినేత కుమారుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండో సారి సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉండి కూడా.. పోయిన చోటే వెతుక్కుంటాను.. అపజయం ఎదురైన చోటే విజయ కేతనం ఎగురవేసి సత్తా చాటుతానని పట్టుబట్టి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2019 ఎన్నికలలో మంగళగిరిలో ఎదురైన పరాభవాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ తరువాత ఐదేళ్ల పాటు మంగళగిరి నియోజకవర్గాన్నే తన నివాసంగా మార్చుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వినా మరెన్నడూ నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అందరివాడు అనిపించుకున్నారు. విజయం తరువాత కూడా ప్రజాదర్బార్ లతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరగొన్న ఫలితమే నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ సభ్వత్వాల సంఖ్య లక్ష దాటింది. అంతే కాకుండా తెలుగుదఏశం శాశ్వత సభ్వత్వాల విషయంలో కూడా మంగళగిరి నియోజకవర్గమే టాప్ లో నిలిచింది.
పార్టీ సభ్వత్వాలను నజరానాలతోనూ, ముడుపులతోనూ చేయించడం సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైనా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఆ వ్యక్తికి పార్టీ పట్ల అపేక్ష, అభిమానం ఉండాలి. లోకేష్ జనంతో మమేకమై వారి విశ్వసనీయత పొందడం వల్లనే నియోజకవర్గంలో జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో అరవై ఆరు శాతం ఓట్లు లోకేష్కు పడ్డాయి. దాదాపుగా లక్షా డెభ్బై వేల ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు. కానీ వారిలో లక్ష మందికిపైగా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబంలో సభ్యులయ్యారు. కార్యకర్తలకు లోకేష్ అండగా ఉంటారన్న భరోసా కలగడంతోనే ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-another-land-mark-39-190551.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.