Publish Date:Oct 22, 2024
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి అయిన నారా లోకేష్.. రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. లోకేష్ మాట ఇచ్చారంటే చేసి తీరుతారన్న విశ్వాసం జనంలో వ్యక్తం అవుతోంది.
తాజాగా నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది. అందులో భాగంగానే తెలుగుదేశం కూటమి సర్కార్ దాదాపు 16 మంది ఐఏఎస్. ఐపీఎస్ లకు పోస్టింగులు ఇవ్వలేదు. వీరంతో జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీరందరిపై కేంద్రం అనుమతితో చట్ట ప్రకారం చర్యలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణంగా అమిత్ షా ఆదివారాలు రాజకీయ నేతలెవరికీ అప్పాయింట్ మెంట్ ఇవ్వరు. అయితే లోకేష్, అమిత్ షా భేటీ ఆదివారమే జరగడంతో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ అనంతరం లోకేష్ చేసిన ఒక ట్వీట్ వీరి భేటీ ఫలవంతమైందన్న సంకేతాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నందుకు అమిత్ షాకు కృతజ్ణతలు తెలుపుతూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ భేటీలో లోకేష్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ హయాంలో వ్యవహరించిన తీరును వివరించినట్లు తెలుస్తోంది. ఈ అధికారులపై ఉన్న కేసులను వివరించి, వారిపై చర్యలకు తెలుగుదేశం కూటమి కట్టుబడి ఉందన్న తెలిపారని అంటున్నారు. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇక్కడ చెప్పుకోవలసిన మరో విషయమేమిటంటే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం దాదాపు ఏడాది తరువాత ఇదే మొదటి సారి. దాదాపు సంవత్సరం కిందట, అంటే చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు లోకేష్ హస్తిన వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విత్ హెల్డ్ లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు అమిత్ షా మద్దతు తెలిపారని అంటున్నారు. అమిత్ షా, లోకేష్ ల భేటీతో వైసీపీ వర్గాలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందనీ, ఇప్పుడిక చర్యల ఉంటాయన్న సంకేతాన్ని ఈ భేటీ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-and-amitshah-sunday-meet-25-187184.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.