పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన

Publish Date:Oct 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ పాలన పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా పరిణమించింది. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అధ:పాతాళానికి పడిపోయింది. రాజధాని అమరావతి నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిలిచిపోయింది. వ్యవసాయం పడకేసింది. శాంతి భద్రతలు గాలిలో దీపంగా మారాయి. జనం భయం గుప్పిట్లో వణికిపోతూ కాలం గడిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పన మాటే వినిపించలేదు. ఇదేమిటంటూ ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లు నోళ్లు తెరిచాయి. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. సమాజంలోని అన్ని వర్గాలూ జగన్ ఐదేళ్ల హయాంలో కష్టాల కడలిలో కాలం గడిపారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టగానే.. కష్టాలు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రం మళ్లీ ప్రగత పథంలో పరుగులు పెడుతోందన్న నమ్మకం కలిగింది. ఇక రాష్ట్ర ఆదాయానికీ, ప్రగతికీ, పురోభివృద్ధికీ, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకూ అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పుంజుకుంటోంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. తరలిపోయిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఇక మరిన్న పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు.  పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు  కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగనుంది. అందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలక  వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.

ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమకు చెందిన 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులు హాజరౌతారు.  అమెరికా మాజీ అధ్యక్షులు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ వంటి  స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఇటువంటి సదస్సుకు ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా  పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా  సినర్జీ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో  కీలకంగా మారిందని గుర్తించిన సినర్జీ ప్రతినిథులు  పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై   లోకేశ్ ను ప్రసంగించాల్సిందిగా కోరింది.   

ఆ సదస్సులో పాల్గొనడమే కాకుండా లోకేష్ అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిథులు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు కానున్నారు. శుక్రవారం అక్టోబర్ 25) ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిథులతో భేటీ అవుతారు.  అలాగే శనివారం (అక్టోబర్ 26)  పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. అనంతరం భారత కాన్సులేట్ జనరల్ తో సమావేశం అవుతారు. ఆ తరువాత ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆ మరుసటి రోజు ఆదివారం అంటే అక్టోబర్ 27న ఆస్టిన్ లో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు.  28న శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 29న లాస్ వెగాస్ లో ఇటీ సర్వ్ సినర్జీ సదస్సులో ప్రసంగిస్తారు. అలాగే అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్టోబర్ 30న లాస్ వెగాస్ లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శిస్తారు. అలాగే స్టార్టప్స్, ఎంటర్ పెన్యూర్స్ తో భేటీ అవుతారు. అక్టోబర్ 31న జార్జియాలోని శినిమౌంటేన్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నవంబర్ 1న న్యూయార్క్ లో పెట్టుబడి దారులతో సమావేశం అవుతారు.  ఆంధ్రప్రదేశ్ కు భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షించి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడమే తన పర్యటన లక్ష్యమని లోకేష్ చెప్పారు.  

తన అమెరికా పర్యటనకు ఒక రోజు ముందు లోకేష్ దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతనిధులతో భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపట్టని చర్యలు, పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చే వారికి ఇస్తున్న రాయతీల గురించి వారికి వివరించారు.   లోకేష్ ప్రజంటేషన్ కు ముగ్ధులైన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు అంగీకరించారు.  

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.