వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం.. ఫలితం అప్పుడే తెలిసిపోయందా?!

Publish Date:May 15, 2024

Advertisement

ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు. రాక్షస పాలనకు చరమగీతం పాడుతున్నామన్న ఉత్సాహంతో వెల్లువలా ఓటింగ్ కు తరలివచ్చారు.  ఓటింగ్ సరళిని చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అనే స్థాయిలో ఓటర్లు తమ ప్రతాపాన్నిచూపారు.

వైసీపీ మూకలు ఘర్షణలు సృష్టించినా, దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఓటుహక్కును వినియోగించుకున్నారు.  దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ కు ముందు రోజువరకు మీడియా మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసీపీ ముఖ్యనేతలు.. పోలింగ్ సరళిని చూసి నీరసించిపోయారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాదని నిర్ధారణకు వచ్చేశారు. పోలింగ్ సమయంలో అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లోనూ వైసీపీకి ఘోర ఓటమి ఎదురుకాబోతుందని స్పష్టమైందని ఆ పార్టీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. ఈ పరిణామాలతో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అలర్ట్ అయ్యారు. తన కుమారుడు సజ్జల భార్గవ్ నేతృత్వంలో కొనసాగుతున్న సోషల్ మీడియా విభాగం కార్యాలయానికి  తాళం వేశారు. దీంతో ఇన్నాళ్లు ఆ విభాగంలో పనిచేస్తూ ‘నువ్వే జగన్.. నీ వెంటే జగన్’ అంటూ నినదించిన ఉద్యోగులు ప్రస్తుతం రోడ్డున పడ్డారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఐదేళ్ల పాటు అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులు పాలుచేశాడు. పోలింగ్ సరళిని చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. వైసీపీ ప్రభుత్వం పాలనా విధానం సరికాదని రాజకీయ ప్రముఖులు, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా జగన్ తీరులో మార్పు రాలేదు. దీనికితోడు జగన్ ప్రభుత్వానికి   సజ్జల భార్గవ్ నేతృత్వంలోని సోషల్ మీడియా విశేష సేవలందించింది. సోషల్ మీడియా పేరుతో భార్గవ్ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని జగన్ ప్రభుత్వం తప్పులను ఒప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలపై ఇష్టమొచ్చిన రీతిలో సోషల్ మీడియా విభాగాల్లో పోస్టులు పెట్టడం, నేతల కుటుంబ సభ్యులపైనా అసభ్యకర పోస్టులు పెట్టడం వంటి దుర్మార్గపు పనులను సజ్జల భార్గవ్ విజయవంతంగా నిర్వర్తించి జగన్ ప్రశంసలు పొందారు. వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం వంటి కార్యక్రమాల్లోనూ భార్గవ్ కీలక భూమిక పోషించారు.  భార్గవ్ పైశాచిక ఆనందానికి ఎంతోమంది ప్రాణాలుసై తం కోల్పోయారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా హద్దులు మీరి ప్రవర్తించడంతో ఈసీ కేసు కూడా నమోదు చేసింది. జగన్ ప్రజావ్యతిరేక పాలనతోపాటు.. భార్గవ్ నేతృత్వంలో కొనసాగుతున్న వైసీపీ సోషల్ మీడియా ఆగడాలకు విసిగిపోయిన ప్రజలు దేశ, విదేశాల నుంచి ఏపీకి తరలివచ్చి ఓటు ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయంపైనే ఉంది. కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగేవి. వందల మంది ఈ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తూ వచ్చారు. వీళ్ల పనల్లా ప్రతిపక్ష పార్టీల నేతలపై విష ప్రచారం చేయడం, వారి ఇళ్లలో మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించడం. దీనికి తోడు ప్రభుత్వం తప్పులను ఒప్పులుగా సోషల్ మీడియా ప్లాంట్ ఫాంల ద్వారా ప్రజల మెదడుల్లోకి చొప్పించడం. ఇలా వైసీపీ కార్యకర్తలను ఓ విధంగా సైకోలుగా మార్చిన ఘనత కూడా భార్గవ్ కు దక్కుతుంది. జగన్ ప్రభుత్వం, వైసీపీ సోషల్ మీడియా అరాచకాలకు విసిరిగిపోయిన ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ సరళినిచూసి ముందుగానే వైసీపీ నేతలు ఓటమిని అంగీకరించారు. తాడేపల్లి కార్యాలయంలోని జగన్ వద్దకు కూడా భారీ ఓటమిని చవిచూడబోతున్నామని సర్వేల ఫలితాలు వెళ్లడంతో.. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసేశారు. ఉన్నట్లుండి 130 మందికిపైగా ఉద్యోగులను తొలగించేశారు. ఈ నెలాఖరు వరకు పనిచేసి జీతం తీసుకెళ్తామని చెప్పినా.. నెల మధ్యలోనే కార్యాలయం మూసేసి ఇంటికి పొమన్నారు. ఇక్కడే మూడు నాలుగేళ్లుగా పనిచేస్తూవచ్చిన ఉద్యోగులను సైతం ఉన్నట్లుండి వెళ్లిపోమనడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అయిన సమయంలో వారికి ల్యాప్ టాప్ తోపాటు ఫోన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ల్యాప్ టాప్, ఫోన్ ఇవ్వాలని ఉద్యోగులకు భార్గవ్ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. రెండేళ్లు వాడుకున్న పాత ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఏం చేసుకుంటారు? సెకెండ్ హ్యాండ్ మార్కెట్ అమ్ముకుంటారా? అంటూ స్జజల, ఆయన తనయుడు సజ్జల భార్గవ్ పై ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పోలింగ్ సరళినిచూసి ఓటమి భయంతో వణికిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో ఉద్యోగులనుసైతం తీసివేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని స్పష్టం కావడంతోనే ఉద్యోగులను తొలగించి ఉంటారని చర్చించుకుంటున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా రెచ్చగొట్టడంతో ఇన్నాళ్లూ రెచ్చిపోయిన కార్యకర్తలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో భయంతో వణికి పోతు న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జగన్, సజ్జల, భార్గవ్ వంటి వారు ఎలాగోలా సేఫ్ ప్లేస్ కు వెళ్లిపోతారు.. ఇన్నాళ్లు వాళ్లనుచూసి రెచ్చి పోయిన మన పరిస్థితి ఏమిట్రా బాబోయ్ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. మొత్తానికి వైసీపీ సోషల్ మీడియా  ఉద్యోగుల పరిస్థితిని చూసి కూటమి పార్టీల నేతలూ, కార్యకర్తలూ నవ్వుకుంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.