తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిరగదేం నాయకా?

Publish Date:Nov 13, 2020

Advertisement

బయట రాష్ట్రాల్లో చక్రాలు తిప్పుతున్న తెలుగు బీజేపీ నేతలు

 

ఎవరయినా ఇంట గెలిచి రచ్చ ఓడతారు. కానీ మన తెలుగు రాష్ట్రాల కమలనాధులు మాత్రం.. ఇంట ఓడి, రచ్చ గెలుస్తున్నారు. అవును. తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద బాధ్యతల్లో పనిచేసిన-చేస్తున్న బీజేపీ అగ్రనేతల చక్రం.. సొంత తెలుగు రాష్ర్టాల్లో మాత్రం తిరగకపోవడమే ఆ పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరుస్తోంది. బయట రాష్ర్టాల్లో తమ నేతలు చక్రం తిప్పినందువల్లే, అక్కడ కమలం వికసించిందంటూ సదరు నేతల వీరాభిమానులు, సోషల్‌మీడియాలో పోస్టింగులు పెడుతుంటారు. మరికొందరు నేతల పేరుతో ఏకంగా అభిమానసంఘాలే ఉన్నాయి. కానీ, ఏపీ-తెలంగాణ రాష్ర్టాల్లో పార్టీని కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేకపోతున్నారో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.

 

ఉమ్మడి-విభజిత రాష్ర్టాలు ఏర్పడి ఇన్నాళ్లయినా... బీజేపీ, రెండు రాష్ర్టాల్లో ఇప్పటిదాకా కనీసం ప్రతిపక్ష స్థానానికీ ఎదగలేకపోయింది. ఆలోగా, ఒకే ఒక్క స్థానాలున్న రాష్ర్టాల్లో సైతం అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష స్థాయికి చేరింది. లోక్‌సభలో రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ, ఇప్పుడు దేశంలో రెండోసారి మళ్లీ అధికారంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీగా అవతరించింది. చివరకు కల అనుకున్న కశ్మీర్‌లో కూడా, అధికారంలో భాగస్వామిగా మారింది. మరికొన్ని రాష్ర్టాల్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోంది.

 

దేశంలో ఇన్ని అద్భుతాలు సృష్టించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, కనీసం ప్రతిపక్ష స్థాయికి సైతం చేరుకోలేకపోవడానికి, కారణమేమిటన్న చర్చకు పార్టీ వర్గాల్లో తెరలేచింది. వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా, పార్టీ మాత్రం ఆ స్థాయి-ఆయన స్థాయికి చేరకపోవడమే ఆశ్చర్యం. అయితే తెలుగు రాష్ర్టాలకు చెందిన రాంమాధవ్, పేరాల చంద్రశేఖర్, మురళీధర్‌రావు, సత్య వంటి నేతలు.. ఇతర రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా ఉన్నప్పుడు, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దానిపై రాంమాధవ్, మురళీధర్‌రావు, సత్య అభిమానులు సోషల్‌మీడియాలో చాలా హడావిడి చేశారు. ఆయా నేతలు ఆ రాష్ర్టాల్లో చక్రం తిప్పినందుకే, పార్టీ విజయం సాధించిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చేలా చూశారు.

 

రాంమాధవ్ కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాలు, మురళీధర్‌రావు కర్నాటక, పేరాల చంద్రశేఖర్ అస్సోం, తాజాగా సత్య బిహార్ ఎన్నికల్లో చక్రం తిప్పారంటూ, వారి అభిమానులు సోషల్‌మీడియాలో హంగామా చేసిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. రెండురోజుల క్రితమే.. బిహార్‌లో పార్టీ బహిరంగ సభల నిర్వహణ బాధ్యత చూసిన, జాతీయ కార్యదర్శి సత్యను అభినందిస్తూ, ఆయన అభిమానులు పోస్టు పెట్టారు. మరి పరాయి రాష్ట్రాల్లో ఇన్ని అద్భుతాలు సృష్టించి.. పార్టీని విజయతీరాలకు చేర్చిన ఈ నాయకులు, సొంత తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి, ఎందుకు వెలుగు తెప్పించలేకపోతున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఏపీలో టీడీపీతో కలసి పోటీ చేస్తే అరజడజను ఎమ్మెల్యే సీట్లు కూడా సాధించలేకపోయింది. ఒక్క ఎంపీతోనే సర్దుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పైగా నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది. చివరాఖరకు ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం పాయింట్ ఎనిమిది!

 

కశ్మీర్‌తోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో చక్రం తిప్పిన రాంమాధవ్ సొంత రాష్ట్రంలో, పార్టీకి ఈ దుస్థితి పట్టడాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మరి ఆయన చక్రం ఏపీలో ఎందుకు తిరగలేదన్నది వారి ప్రశ్న. రాంమాధవ్ సొంత తూర్పు గోదావరిలో గానీ, జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్య సొంత కడప జిల్లాలో గానీ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

 

ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి వరకూ ఎదిగి.. కర్నాటకలో అద్భుతాలు సృష్టించి, తమిళనాడులో పార్టీపరంగా కొన్ని వివాదాల్లో ఇరుకున్న మురళీధర్‌రావు.. తన సొంత తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి, కనీసం రెండోసీటు కూడా ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మురళీధర్‌రావు తన సొంత కరీంనగర్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు సాధించలేకపోయారని, చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేకపోయారని నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 5 సీట్లు సాధించిన పార్టీ, తర్వాత ఎన్నికల్లో ఒక్క అదనపు స్థానం సాధించలేకపోగా, ఒక్కటి మాత్రమే వచ్చిందంటే.. మరి ఆయన చక్రం తెలంగాణలో ఎందుకు తిరగలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

 

దుబ్బాకలో గెలిచిన రఘునందన్‌రావు స్వయంకృషితోనే, పార్టీకి ఒక సీటు అదనంగా వచ్చింది తప్ప, ఎవరి చక్రాలు అక్కడ తిరగలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ విజయం వెనుక అభ్యర్థితోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ శ్రమ, వివేక్ వెంకటస్వామి వంటి నేతల సహకారం మాత్రమే ఉందంటున్నారు. తొలి ఎమ్మెల్యే రాజాసింగ్, తాజాగా రఘునందన్ విజయం వారి వ్యక్తిగతమేనని స్పష్టం చేస్తున్నారు.

 

దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండి, అధికార టీఆర్‌ఎస్ కోట్ల రూపాయలు వెదజల్లుతోందన్న ఆందోళన, ప్రచార సమయంలో బీజేపీ నేతల్లో వ్యక్తమయింది. కానీ అభ్యర్ధి రఘునందన్‌రావుకు, జాతీయ పార్టీ నుంచి సకాలంలో ఆర్ధిక సహకారం అందించేలా చూడటంలో.. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారంతా విఫలమయ్యారని నేతలు స్పష్టం చేస్తున్నారు. అక్కడి నుంచి ‘రెండు అంకెలకు’ మించి ఆర్ధిక సాయం రాలేదంటే, పదవుల్లో ఉన్న వారిపై జాతీయ నాయకత్వానికి.. ఎంత నమ్మకం- వారికి జాతీయ నాయకత్వ వద్ద పలుకుబడి, ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

అస్సోంలో చక్రం తిప్పిన మరో నేత పేరాల చంద్రశేఖర్, స్వయంగా ఎల్‌బినగర్‌లో పోటీ చేసి ఓడిపోవడమే ఆశ్చర్యమంటున్నారు. ఒక రాష్ట్రంలోనే చక్రం తిప్పిన ఓ అగ్రనేత.. చివరాఖరకు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి తానే ఓడిపోయారంటే, దాని సంకేతం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే వీరికి స్థానబలం లేకపోవడం ఒక కారణమయి ఉండాలి. లేదా స్థానికంగా ప్రజల నాడి తెలుసుకోవడంలోనయినా, విఫలమయి ఉండాలని విశ్లేషిస్తున్నారు.

 

ఇక ఎన్నికల్లో వైఫల్యాలను.. కేవలం రాష్ట్ర అధ్యక్షులనే బాధ్యులను చేస్తున్న నాయకత్వం, పార్టీకి దిశానిర్దేశం చేసే.. సంఘటనా కార్యదర్శులను మాత్రం కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వైఫల్యానికి అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్, ఏపీలో వైఫల్యానికి కన్నా లక్ష్మీనారాయణను బాధ్యులను చేసి, వారిని తొలగించారు. అందులో లక్ష్మణ్‌ను, ఓబీసీ జాతీయ సెల్ అధ్యక్షుడిగా నియమించగా, కన్నాకు అది కూడా ఇవ్వలేదు. అది వేరే విషయం.

 

కానీ తెలంగాణ సంఘటనా కార్యదర్శిగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్-రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్, రెండున్నరేళ్ల నుంచి ఏపీ సంఘటనా కార్యదర్శిగా కొనసాగుతున్న మధుకర్-రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోథర్‌ను మాత్రం, అలాగే కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, ఆరేళ్ల నుంచి బాధ్యునిగా వ్యవహరిస్తున్నా, పార్టీ కించిత్తు పురోగతి సాధించలేదంటున్నారు.

 

అటు జాతీయ స్థాయిలో కూడా వైఫల్యాలకు, సంఘటనా కార్యదర్శులు నైతిక బాధ్యత వహించకపోవడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ-తెలంగాణకు మూడు దశాబ్దాల నుంచి ఇన్చార్జిగా ఉన్న, జాతీయ సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి, సాధించిన పురోగతి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక రెండేళ్ల నుంచి ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌జీ కూడా, అదే హోదాలో కొనసాగుతున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

 

మరి ఇటీవలి ఎన్నికల పరాజయంలో వారి పాత్ర లేదా? వారి అనుమతితోనే టికెట్లు, నిర్ణయాలు జరిగినప్పుడు, మరి వారెందుకు బాధ్యత వహించరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించడంలో సీరియస్‌గా దృష్టి సారించి, ఎక్కువ సమయం కార్యకర్తల మధ్య గడిపి ఉంటే .. తెలుగు రాష్ర్టాల్లో పార్టీ పరిస్థితి, ఇంత విషాదంగా ఉండేది కాదన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లో.. అనుబంధసంస్ధలతో సమావేశం నిర్వహించారు. కానీ వారి నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోకుండా, నేతలు చెప్పింది వినకుండానే కేవలం అరగంటలో ఆ సమావేశాన్ని ముగించిన వైనాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అంటే దీన్నిబట్టి... రాష్ట్రానికి బాధ్యులుగా వచ్చేవారికి, స్థానిక అంశాలపై ఎంత శ్రద్ధ ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.