కొత్త మద్యందుకాణ యజమానులకు పాతయజమానుల ఇంటర్వ్యూలు?
Publish Date:Jun 19, 2012
Advertisement
కొత్త మద్యం దుకాణదారులకు ప్రస్తుత యజమానులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారినే కొత్తపాలసీ కింద ఎక్సైజ్ కు దుకాణదారులుగా పరిచయం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తపాలసీ ప్రకారం రూపొందించిన నిబంధనావళి కాపీలను ప్రస్తుత యజమానులు తమ దగ్గర పెట్టుకుని అర్హతలు కూడా పరిశీలిస్తున్నారు. పాన్ కార్డ్, మూడేళ్ళ రిటర్న్స్ దాఖలు చేయగలిగితే తెలివైన అమాయకుల కోసం ప్రస్తుత మద్యం దుకాణ యజమానులు వెదుకుతున్నారు. ప్రత్యేకించి తమ కాళ్ళదగ్గర పడుండే వారిలో నమ్మకస్తులను ఎంపిక చేసుకుంటున్నారు. అలా లేకపోతే కొత్తవారిని పిలిపించి ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తరువాతే ఇంటర్వ్యూలు, ఎంపిక పూర్తి చేస్తున్నారు. తమకు నచ్చితే దరఖాస్తు నింపేసి వారిని నేరుగా ఎక్సైజ్ కార్యాలయం ముందు దింపుతున్నారు. ఇలా తమవారినే ఎక్సైజ్ శాఖ లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు పైరవీలకూ సిద్ధమవుతున్నారు. దుకాణం శాంక్షన్ అయితే పెట్టుబడి తమది కాబట్టి 70 శాతం లాభం వదిలేయాలని ఒప్పందం చేసుకుంటున్నారు. తాము పంపించే వారిలో ఎవరు ఎంపికవుతారో తెలియదు కాబట్టి ముందస్తుగా ప్రతీ యజమాని తమ తరుపున ముగ్గురిని లాటరీకి పంపిస్తున్నారు. తక్కువ జీతంతో కుటుంబ అవసరాలు తీరని ప్రయివేటు ఉద్యోగులు ఈ దుకాణాల కోసం ఆశపడుతున్నారు. ప్రస్తుత మద్యం షాపుల యజమానులు కూడా వీరిపైనే కన్నేశారు. వీరికైతేనే పాన్ కార్డ్, మూడేళ్ళ రిటర్న్స్ ఉంటాయి. అందుకే ముందుగా బంధువుల్లో ఈ తరహా ఉద్యోగులను వెదుకుతున్నారు. దొరక్కపోతేనే కొత్తవారికి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించే ఇంటర్వ్యూల కన్నా ప్రస్తుత మద్యం దుకాణదారుల ఇంతర్వ్యూలకే డిమాండు ఉంటోంది. అప్ సెట్ ధరలో మూడోవంతు ముందుగానే చెల్లించటానికి ప్రస్తుత యజమానులు సిద్ధంగానే ఉన్నారు. ఏడాదిలో సత్ప్రవర్తన ఉంటేనే మద్యం దుకాణం మరో ఏడాది కొనసాగుతుంది కాబట్టి ఆ తరహాలో కనిపించే వారినే ప్రస్తుత యజమానులు పంపుతున్నారు. కొత్తగా వచ్చే యజమానులు కూడా సిండికేట్ అయ్యేందుకు వీరు ముందునుంచే ప్రతిపాదనలు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తులో భాగస్వామి పెరుండాలన్న నిబంధన ప్రకారం తమ పేర్లయితే ఎక్సైజ్ అధికారులు గుర్తుపదతారు కాబట్టి ఇంట్లో మరొకరి పేరును భాగస్వామిగా రాయిస్తున్నారు. అంటే మొత్తానికి ఎన్ని కేసులు పెట్టినా మద్యం దుకాణాలను వదలటానికి ప్రస్తుత యజమానులకు ఇష్టం లేదు. లాభానికి అలవాటుపడ్డ ప్రాణం కాబట్టి తమ తరుపువారి పేరుతొ దుకాణాలను సొంతం చేసుకోవాలని ప్రస్తుత యజమానులు ఆరాటపడుతున్నారు. ఈ తెరవెనుక భాగోతం అంతా తెలిసినా ఎక్సైజ్ శాఖ మౌనంగా ఉంటోంది. తాము లాభపడే అవకాశాలను కాలదన్నుకోకుండా ఆ శాఖ ఉద్యోగులు కొత్త దరఖాస్తులను లాటరీ కోసం స్వీకరిస్తున్నారు. ఈ తతంగం రాష్ట్రంలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూసింది.
http://www.teluguone.com/news/content/liquor-shops-in-hyderabad-24-14981.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





