తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందా? పార్టీ పరిస్థితి, మనుగడపై ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే గందరగోళం నెలకొందా? అంటే బీఆర్ఎస్ శ్రేణులే ఔనంటున్నాయి. అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో అప్పుడప్పుడు ఎర్రవల్లి వచ్చిన నాయకులతో చిట్ చాట్ నిర్వహించడం తప్ప ఆయన పార్టీ వ్యవహారాలలో కానీ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. పార్టీ కార్యక్రమాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి.
ఇక్కడే పార్టీ నాయకుల్లో విభేదాలు, అసంతృప్తులు మొదలయ్యాయి. కేటీఆర్, కవిత మధ్య అంతరం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయితే వీటి పరిష్కారంపై కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరకు తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీలో పరిస్థితిపై లేఖరాసినా కేసీఆర్ స్పందించక పోవడంతో.. కొందరు ఆ లేఖ ను లీక్ చేశారు. దీంతో కేసీఆర్ సంతానం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రచ్చకెక్కయి. ఈ నేపథ్యంలోనే కవిత జిల్లాల పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో తాము పాల్గొనాలా వద్దా అనే విషయంపై అధినేత కేసీఆర్ నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తే.. ఆయన కేటీఆర్ ను సంప్రదించమని చెప్పి చేతులెత్తేశారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు అన్నీ కేటీఆర్ చేతుల్లోకి వెళ్లాయి. దీనిపై పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారు. అందరినీ కలుపుకుని పోకుండా కేటీఆర్ కొందరికే అందుబాటులో ఉండటంపై మెజారిటీ నాయకులు అసంతృప్తితో ఉన్నారంటున్నారు.
ఈ విషయాన్ని కేసీఆర్ కు చెప్పలేక సతమతమవుతున్నారు. కేటీఆర్ శైలి నచ్చక వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు చూసుకొని పార్టీలో కొనసాగాలా లేక వైదొలగాలా అనే మీమాంసలో ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కూడా జిల్లాల్లో నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. ఈ పరిణామాలన్నీ పార్టీని గందరగోళంలో పడేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leaders-loosing-hopes-on-brs-39-203447.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.