తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది : కాగ్

Publish Date:Sep 23, 2019

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదని రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాగ్ పేర్కొంది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికే రాష్ట్ర అప్పులు రెండు లక్షల కోట్లు దాటాయని కొత్తగా తీసుకొస్తున్న అప్పులు సింహ భాగం పాత రుణాలు తీర్చేందుకే ఉపయోగించాల్సి వస్తోందని వెళ్ళడించింది. రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిది మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితులను కాగ్ తన నివేదికలో వివరించింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ వార్షిక బడ్జెట్ అంచనాలు వాస్తవాలకు భారీ వ్యత్యాసం ఉందని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి, ఖర్చు, మూలధన వ్యయంలో అంచనాలు వాస్తవాలకు పోలిక లేదని పేర్కొంది.

బడ్జెట్ రూపకల్పనలో హేతుబద్ధత అవసరమని సూచించింది. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఏ మేరకు పలితాలు పొందుతున్నారో ప్రభుత్వం ప్రకటించలేకపోయిందని కాగ్ ఆక్షేపించింది. నిర్మాణంలో జాప్యం వల్ల ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగినట్టు పేర్కొంది. పెట్టుబడులపై రుణాలు, డిస్కంలపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది. పన్నుల వసూలు మూలధన వ్యయంలో మాత్రం కేసీఆర్ సర్కారు ముందంజలో ఉందని ప్రశంసించింది. కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైందని కొనియాడింది. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో దృఢ వైఖరి అవ లంబించాలని కాగ్ సూచించింది. అలా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు బేషరుతుగా రుణాలు ఇవ్వడం, పాత రుణాలు తిరిగి చెల్లించేందుకు మళ్లీ అప్పులివ్వడం జవాబుదారీతనానికి విఘాతం కలిగిస్తోందని ఆర్ధిక నిర్వహణ సరిగా లేదన్న విషయాన్ని తెలియజేస్తోందని అబిప్రాయపడింది.

అప్పుల చెల్లింపు భారాన్ని తట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులను పెంచుకోవాలి. ఇది జరగాలంటే భూములు అమ్ముకోవాలి లేదా పన్నుల పెంచుకోవాలి లేకపోతే మూలధన వ్యయాన్ని తగ్గించుకోవాల్సి వస్తుందని కాగ్ హెచ్చరించింది. ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు అప్పు తెస్తే అందులో పది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు వడ్డీ చెల్లింపులకు, మరో నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు అసలు అప్పు చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చిందనీ వివరించింది. పన్నుల రాబడిలో ఎనిమిది శాతం అప్పులు చెల్లించటానికే పోతుంది అని తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జీ.ఎస్.డీ.పీ తో పోల్చినప్పుడు అప్పులు పదిహేను పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉండగా రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిదిలో పంతొమ్మిది శాతానికి పెరిగాయంది.

రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికి ఉన్న మొత్తం అప్పు లక్షా నలభై రెండు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది కోట్లు అని తెలిపింది. ఈ అప్పులు వడ్డీల చెల్లింపులకు రానున్న ఏడేళ్లలో ప్రభుత్వం లక్ష అరవై మూడు వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. మరోవైపు పూచీకత్తుల అప్పు నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అప్పుల భారం రెండు లక్షల ఐదు వేల కోట్లని కాగ్ వెల్లడించింది. రాష్ట్రంలో రాబడి పెరిగినా అంచనాల స్థాయిలో లేదని తెలిపింది. రెండు వేల పదిహహేడు పధ్ధెనిమిదికి రెవిన్యూ రాబడి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు అని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఆరు వేల ఆరు కోట్లు పెరిగినప్పటికీ బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు తగ్గిందని వివరించింది.

రెవెన్యూ ఖర్చుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందని కాగ్ వ్యాఖ్యానించింది. ఖర్చులు ఎనభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లని ఇవి అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు పెరుగుదల ఉన్నప్పటికీ అంచనాల కంటే ఏడు వేల ఇరవై ఎనిమిది కోట్లు తక్కువని పేర్కొంది. అంచనాలకు వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్ధం చేయాలని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రెండు వేల పదిహేను, పదహారు, రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిది మధ్య కాలంలో రెవెన్యూ రాబడి, ఖర్చులు రెండూ పెరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రెవెన్యూ మిగులును మూడు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మేర ఎక్కువగా చూపగా ద్రవ్యలోటును తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల మేర తగ్గించి చూపారని వెల్లడించింది. రెండు వేల పదహారు, పదిహహేడుతో పోలిస్తే రెండు వేల పదిహహేడు పధ్ధెనిమిదిలో వడ్డీ చెల్లింపుల్లో ఇరవై ఆరు శాతం పెరుగుదల ఉందని తెలిపింది.

విద్యా రంగంలో రాష్ట్రం వెనుకబడిందని తెలిపింది. సాగునీటి పారుదల రంగం మీద పెడుతున్న భారీ పెట్టుబడుల వల్ల కలిగిన ప్రయోజనాలను మదింపు చేయటానికి వాటి ఫలితాలను ప్రభుత్వం సంకలనం చేయాలని కాగ్ తెలిపింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికి రాష్ట్రంలో ముప్పై ఆరు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో పంతొమ్మిది ప్రాజెక్టుల విషయంలో మూడు నుంచి పదకొండేళ్ల వరకు జాప్యం జరిగిందని వెల్లడించింది. ఈ కారణంగా తొలి అంచనా వ్యయం నలభై రెండు వేల రెండు వందల ఒక్క కోట్ల నుంచి లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే డెబ్బై వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసినా అవి ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేసింది.

దీనికి అదనంగా ముప్పై ఐదు వేల రెండు వందల కోట్లతో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని సాగునీటి ప్రాజెక్టుల ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని వెల్లడించింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలను విడుదల చేయాలని సూచించింది. నూతన విధాన నిర్ణయాలను అమలు పరిచేటప్పుడు డిస్కమ్ లకు నష్ట పరిహారం చెల్లించాలని కాగ్ సిఫారసు చేస్తుంది. వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ నిర్ణయం డిస్కంల ఆర్థిక పరిస్థితులను మరింత ప్రభావితం చేసిందని వివరించింది.

సీపీఎస్ కోసం ఉద్యోగుల మూలవేతనం కరువు భత్యాల నుంచి ప్రభుత్వం ప్రతి నెలా పది శాతం చందాల రూపంలో వసూలు చేస్తుంది. దీనికి సమానమైన మొత్తాన్ని తన వాటాగా చెల్లించాల్సి ఉంది కానీ, ఇది అమలు కావడం లేదని ప్రభుత్వం కనీస వడ్డీలు కూడా చెల్లించడం లేదని కాగ్ పేర్కొంది. ప్రభుత్వం తన వాటాను తక్కువగా జమ చేయటం వడ్డీ కోసం కేటాయింపులు చేయకపోవడం వల్ల రెవిన్యూ మిగులు ఎక్కువగానూ, ద్రవ్యలోటును తక్కువగా చేసి చూపినట్లు తేలిందని స్పష్టం చేసింది. రెండు వేల పద్నాలుగు, పదిహేను నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు నూట నలభై ఒక్క కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు బకాయి పడిందని తెలిపింది. ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దకపోతే సీపీఎస్ మూలనిధి దివాలాకు దారితీసి పథకం వైఫల్యానికి చివరికి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.

By
en-us Political News

  
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.