భూమన కబ్జానుంచి రూ. వంద కోట్ల విలువైన భూమికి విముక్తి.!

Publish Date:Jul 23, 2026

Advertisement

టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు, భూమన కరుణాకర్‌రెడ్డికి ఏపీ  ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో   అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన ఆయన సాగించిన భూ ఆక్రమణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు  విలువైన ప్రభుత్వ,  ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు.  భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన  ఈ భూములు  మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.  

 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. ఆ సమయంలో తిరుపతి  ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తిరుపతికి సమీపంలోని తిరుచానూరు, మంగళం, చిగురువాడ గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములను, రైతులకు చెందిన స్థలాలను ఆక్రమించినట్లు  విచారణలో తేలింది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూమన ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది.  ఆ ఆదేశాల మేరకు విచారించిన విజిలెన్స్ అధికారులు..  క్షేత్రస్థాయిలో రికార్డులను, సర్వే నంబర్లను నిశితంగా పరిశీలించి ఆక్రమణలు జరిగాయని నిర్థారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 

ఆ నివేదిక మేరకు మంగళం ప్రాంతంలో దశాబ్దాలుగా స్థానిక రైతులు పశువుల మేత కోసం ఉపయోగించుకుంటున్న సుమారు ఏడున్నర ఎకరాల అనాధీనం, మందబయలు భూములను భూమన ఆక్రమించారు. ఈ భూములమార్కెట్ విలువ  0 కోట్లకు పైగా ఉంటుంది. అలాగే..  మరో  ఐదెకరాల ప్రభుత్వ భూమిని కూడా భూమన కబ్జా చేసినట్లు విజిలెన్స్ విచారణ ఆధారాలతో సహా నిర్ధారించింది.  మంగళం  గ్రామంలోని సర్వే నంబరు 47/1 పరిధిలోని 5.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, అలాగే సర్వే నంబరు 47/5 లోని 3.07 ఎకరాల అనాధీనం స్థలాన్ని భూమన కబ్జా చేసి వినియోగించుకున్నట్లు విచారణలో  బయటపడింది. 

ఇంకా.. స్థానిక భూ యజమానులను భయాందోళనలకు గురిచేసి ప్రైవేటు ఆస్తులను సైతం భూమన కబ్జా చేసినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. సర్వే నంబరు 47 పరిధిలో ఒక  భూ యజమానిని బెదిరించి, సుమారు 3.07 ఎకరాల  స్థలాన్ని  స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ సమర్పించిన ఆధారాలతో స్పష్టత రావడంతో..  రెవెన్యూ యంత్రాంగం, పోలీసు బలగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయి చర్యలకు దిగాయి. మంగళం గ్రామంలోని 47/1 సర్వే నంబరు పరిధిలోని 5.10 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన తాత్కాలిక కట్టడాలను జెసిబిలతో కూల్చివేసి, ఆ స్థలం ప్రభుత్వానిదేనంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు.

అలాగే.. సర్వే నంబరు 47/5 లో ఉన్న 3.70 ఎకరాల భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో అక్రమంగా వరి పంటను సాగు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న ప్రతి భూమి వద్ద రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తూ, ఈ ఆస్తులపై ఎవరైనా హక్కులు కోరినా,  తిరిగి ఆక్రమణలకు పాల్పడినా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని   హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను, దేవాలయం,  ఇనాం స్థలాలను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేయడం స్థానికుల నుంచి హర్షం వ్యక్త మౌతోంది.  
అదలా ఉంటే..    భూ ఆక్రమణల వ్యవహారంలో భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన అధికారులపై, ఇతర నేతలపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

Bhumana Karunakar Reddy, Land encroachments,  Recovery, Encroached land Tirupati, Seizure of lands  Mangalam

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.