తెరాస ప్రభుత్వం తప్పటడుగు వేస్తోందా?

Publish Date:Jun 30, 2014

Advertisement

 

గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూములలో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చి వేసిన తెరాస ప్రభుత్వం దృష్టి ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోగల లగడపాటికి చెందిన ల్యాంకో భూములపై పడింది. వక్ఫ్ బోర్డు కు చెందిన ఆ భూములలో 108 ఎకరాలు ల్యాంకో కొనుగోలు చేసి అక్కడ పెద్ద ఎత్తున భవనాలు నిర్మించింది. ల్యాంకోతో బాటు వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపు 1508 ఎకరాల భూములను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వమే అమ్మివేసింది. జలయజ్ఞం ప్రాజెక్టుల కొరకు నిధులు సమీకరించేందుకు ఈ భూములను అమ్మినట్లు సమాచారం. కానీ చట్ట ప్రకారం వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ప్రభుత్వం కూడా అమ్మడానికి వీలులేదు. అందుకే ఈ భూముల అమ్మకం వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఒక కేసు నడుస్తోంది. ప్రభుత్వం తన తప్పును సరిద్దిద్దు కొనకపోగా అవి వక్ఫ్ బోర్డుకి చెందిన భూములు కావని, కనుక వాటిని బోర్డుకు అప్పగించవలసిన అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఒకవేళ అవి వక్ఫ్ బోర్డుకు చెందిన భూములేనని తేలినట్లయితే, ప్రభుత్వమే వక్ఫ్ బోర్డుకు ఆ భూమి ధర లేదా వక్ఫ్ బోర్డు కోరుకొన్న చోట అంతే విస్తీర్ణంగల భూమిని ఇవ్వవలసి ఉంటుందని కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

 

ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలతో బాటు వాటి ఆలోచనలు మారాయి. తెలంగాణాలో కొత్తగా అధికారం చేప్పట్టిన తెరాస ప్రభుత్వం కోర్టు నుండి కేసు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. టీ-మంత్రి హరీష్ రావు మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ” ఇంతకు ముందు ఉన్న ఆంధ్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు భూములను అమ్మడం చట్ట వ్యతిరేఖమని తెలిసి ఉన్నప్పటికీ అమ్మివేసింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఆ భూములను వక్ఫ్ బోర్డుకే తిరిగి అప్పజెప్పాలని నిశ్చయించుకొంది,” అని తెలిపారు.

 

అయితే ఇది కేవలం ల్యాంకో కంపెనీ ఒక్క దానికే చెందిన సమస్య కాదు. అక్కడ భూములు కొన్న మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలూ భూమిని కొన్నాయి. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఈ భూముల వ్యవహారం లో సుప్రీం కోర్టులో కేసు వాపసు తీసుకొన్నట్లయితే, కోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం తెలంగాణా ప్రభుత్వమే వక్ఫ్ బోర్డుకు నగర శివార్లలో 1508 ఎకరాలు లేదా దాని విలువ చెల్లించవలసి ఉంటుంది. కానీ ల్యాంకో తదితర సంస్థలు ఒక్కో ఎకరానికి దాదాపు రూ. 4-5 కోట్లు చెల్లించి ఆ భూములను కొనుకోన్నాయి గనుక, వాటిని ఇప్పుడు కొత్తగా అధికారం చేప్పట్టిన తెలంగాణా ప్రభుత్వం కూడా తప్పుపట్టలేదు. తప్పుపట్టినట్లయితే ల్యాంకోతో బాటు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపైన కూడా ఇదేవిధమయిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

 

ఒకవేళ ఈ భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వాం ముందుకు సాగదలిస్తే, సదరు వ్యక్తులు సంస్థల తరపున వక్ఫ్ బోర్డుకి తనే భూమి లేదా నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చును. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం అక్కడ ఎకరం రూ8 నుండి 10 కోట్ల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెరాస ప్రభుత్వం1508 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయం నగర శివార్లలో అంతే విస్తీర్ణం గల భూమి లేదా రూ. 15,080 కోట్లు నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో బహుశః ఈ రెండు కూడా సాధ్యం కాకపోవచ్చును. అటువంటప్పుడు ఈ భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వం కూడా చల్లబడిపోతుందా లేక ఏవిధంగా ఈ సమస్యను పరిష్కరించుకొంటుంది? అనేది చూడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.