ప్లాస్టిక్ సర్జరీతో ఇరకాటంలో పడ్డ ఇరు రాష్ట్రాల పోలీసులు...

Publish Date:Oct 15, 2019

Advertisement

 

ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖారవిందం కోసం చేసుకునే ఈ సర్జరీలు దొంగలకు కలిసొస్తున్నాయి. ప్లాస్టిక్ సర్జరీలతో ముఖం మార్చుకోవచ్చన్న టెక్నిక్ ను దొంగలు ఫాలో అవుతున్నారు. ఇటీవల అలాంటి చిన్నపాటి సర్జరీని చేయించుకున్న మురుగన్ కు బాగానే కలిసొచ్చింది. మొత్తానికీ ముఖాన్ని మార్చుకునేయత్నం చేయక పోయినా పోల్చుకో లేకుండా మారిపోవడం అతనికి బాగా కలిసి రావడమే కాక పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దొంగతనం చేసింది అతనే అని తెలిసినా పట్టుకోలేక పోయారు. దాంతో ఈ మధ్య కాలంలో తనకు అనువుగా మార్చుకున్న ఈ దొంగ ఏకంగా కోర్టులో లొంగిపోయి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. డబ్బులు ఊరికే రావు, చాలా కష్టపడాలి, దొంగతనము అంతే అదంత ఈజీ కాదని ఈ మురుగన్ చూపించాడు. కొట్టేసిన సొమ్మును పక్కా ప్లాన్ ప్రకారం మార్చేశాడు. చోరీ అయిన మొత్తం బంగారంలో అయిదు కిలోల వరకు పట్టుకున్నా ఇంకా చాలా వరకూ బంగారాన్ని మురుగన్ చేతులు మార్చినట్లు అనుమనిస్తున్నారు. ఇప్పుడు ఆ గోల్డ్ ను రికవరీ చేయడం చెన్నై పోలీసులకు కష్టతరంగా మారింది.  ప్లాస్టిక్ సర్జరీ కారణంగా అతన్ని పట్టుకోవడంలో ఆలస్యం జరిగింది.ఈ లోపే దొంగతనం చేసిన బంగారాన్ని మొత్తం సర్దేశాడు మురుగన్. ఒకప్పటి పాత ఫొటో ఇప్పటి సర్జరీ ఫోటోను చూస్తే ముఖంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అప్పుడు బక్కపలచగా అందవిహీనంగా ఉంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ సర్జరీతో స్మార్ట్ గా తయారయ్యాడు మురుగన్. అదే అతనికి ప్లస్ అయితే పోలీసలుకు మైనస్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ పోయే మురుగన్ చెన్నైలోని లలిత జూలరీలో దొంగతనం చేశాక అనూహ్యంగా మాయమయ్యాడు.

తన అనుచరుడు ఒకడు పట్టుబడటంతో ఐదు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగితా సొత్తును స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు ముందుకు సాగుతుండగానే మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోవడం సంచలనంగా మారింది. మరో దొంగ సురేష్ తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో లొంగిపోయాడు. ఇప్పుడు మురుగన్ లొంగుబాటు కూడా ఓ వివాదంగా మారింది. అతనిని నుంచి పది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదంటే తమదంటూ కుస్తీపడుతున్నారు. కర్ణాటక పోలీసులు తమ రాష్ట్రాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన గోల్డ్ గా చెబుతుండగా చెన్నై పోలీసులు లేదు లేదు అది ముమ్మాటికీ లలితా జ్యువెలరీ కేసు సొత్తేనని వాదిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా గోల్డ్ వారు నెలకొంది. తిరుచ్చి జిల్లాలోని తిరువెంబూర్ లో మురుగన్ ఉండే అద్దె ఇంటి సమీపంలో కూడా పోలీసులు అతని ఫోటో పట్టుకొని ఆరా తీశారు. అయినా అక్కడ వారు గుర్తించలేకపోయారు. దీంతో కంగుతిన్న పోలీసులు అసలు విషయం ఆరా తీయగా అతను కొద్దిగా ప్లాస్టిక్ సర్జరీ డెంటల్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు. అంతకుముందు అనారోగ్యంతో ఉన్న అతని ఫోటోకు ఇప్పటి ఫొటోకు చాలా వ్యత్యాసం ఉండడంతో పోలీసులు మొదట గుర్తించలేకపోయారు. చేతి వాటం చూపడంలో మురుగన్ ది అందెవేసిన చెయ్యి. అందుకే అతన్ని పట్టుకోవడం కొన్ని సందర్భాల్లో పోలీసులకు సవాలుగా మారుతూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కూడా మరో కారణం ఉందని ప్రచారం ఉంది. అతనికి ఎయిడ్స్ ఉందని, ఆ అనారోగ్యం విషయం బయటివారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

సినిమాలపై కూడా మురుగన్ కు బాగానే మోజుంది. గతంలో అనేక దొంగతనాలకు పాల్పడిన సొత్తుతో మూడు నాలుగు సినిమాలు కూడా తీశాడు. ఓ హీరోయిన్ తో విదేశాలలో తిరిగాడని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ పదిహేనేళ్ల కాలంలో మురుగన్ సంపాదించిన ఆస్తి వంద కోట్ల వరకు ఉంటుందని పోలీసులు లెక్కలే చెబుతున్నాయి. దొంగతనం చేసిన సొత్తులో మెజార్టీ డబ్బును సినిమాల నిర్మాణం కోసమే మురుగన్ ఖర్చు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కొంత మంది పేర్లతో బినామీ ఆస్తుల్ని కూడా దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతనితో  సన్నిహిత్యంగా ఉన్న వారిపైన నిఘా పెట్టారు పోలీసులు. సినిమాలపై మోజుతో తెలుగులోనూ చిన్న చిన్న చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. 

రెండు వేల పదిహేనులో బెంగుళూరులో ఓ వ్యాపార వేత్త ఇంట్లో దొంగతనం చేశాక 3.16 కోట్ల ఆస్తిని రికవరీ చేసేందుకు అక్కడి పోలీసులకు తొంభై రోజుల సమయం పట్టింది. ఆ తరువాతనే మురుగన్ తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కొత్త లుక్ తో దొంగతనాలకు తెగబడుతున్నట్లు అర్ధమవుతోంది. మురుగన్ చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీతో పోలీసులు బోల్తాపడ్డారు. మురుగన్ ఎపిసోడ్ తో చోరీ తతంగం కాసింత పక్కకు వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు ప్లాస్టిక్ సర్జరీతో మొత్తం మొహాన్ని మార్చుకోవడం సాధ్యమవుతుందా సినిమాల్లో చూపించినట్టు జరుగుతుందా ఒకవేళ సాధ్యమైతే ఎన్ని సర్జరీలు చేసుకోవాలి.ఏదేమైనా మున్ముందు సర్జరీలు అంటూ వచ్చే వారి అవసరం ఎంత ఉన్నా వారి వివరాలు ఏంటన్న దానిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే సమాజానికి చెడు చేసే దుర్మార్గులకు ఇలాంటి సర్జరీలు కలిసి వచ్చేలా మారుతుండటం మరింత ఇబ్బందికర పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ సర్జరీ కారణంగా పోలీసులను ముప్ప తిప్పలు పడుతున్నారనే విషయం వెల్లడవుతోంది.

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.