పబ్ లో పార్టీ అంటూ ఎర.. కట్ చేస్తే కిడ్నాప్.. బ్లాక్ మెయిల్!

Publish Date:Aug 1, 2025

Advertisement

పబ్బులో పార్టీ చేసుకుందామన్న ఓ కిలేడీ ఎరకు చిక్కుకున్నాడు.   పబ్బులో పార్టీ అనేసరికి ఆ యువకుడు ఎగిరి గంతేశాడు.. పబ్ కు రమ్మని పిలిచింది ఒక బార్లో డాన్సర్ గా పని చేసే లేడీ కావడంతో  ముందు వెనుక ఆలోచించకుండా  రాత్రి సమయంలో పబ్బుకు చేరుకున్నాడు.  అప్పటికే అక్కడ మాటు వేసిన కిలేడీకి చెందిన గ్యాంగ్  మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెడితే..  సచిన్ దూబే  అనే వ్యక్తి  ఒక జ్యువెలరీ షాపులో పార్ట్నర్ గా ఉన్నాడు.. అతనికి డబ్బు కొదవలేదు. ఇదే అతనిని టార్గెట్ చేయడానికి కారణమైంది. పబ్ లో డ్యాన్సర్ గా పని చేసే యువతి అతడితో పరిచయం పెంచుకుని పబ్ కు ఆహ్వానించింది. ముందు వెనుకలాలోచించకుండా పబ్ కు కెళ్లిన సచిన్ దుబేని ఆ డ్యాన్సర్, ఆమె గ్యాంగ్ కిడ్నాప్ చేశారు.  

అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు.. ఆ తర్వాత ఒక వీడియోని చూపారు. ఒక యువతితో సచిన్ సరసాలు ఆడుతున్న సమయంలో తీసిన ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారు.  ఆ వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదరించారు. తాము అడిగిన 10 లక్షల రూపాయల డబ్బు ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమంలో  పోస్ట్ చేసి పరువు తీస్తామని బెదిరించారు  వీడియో ను  ఆసరాగా చేసుకొని ఒక బార్ లో డాన్సర్ గా పని చేస్తున్న లేడీ తో సహా పబ్బులో పనిచేసే యువకుడు, మరో ముగ్గురు కలిసి సచిన్ దూబే  కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి విషయం పోలీసుల వద్దకు చేరడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 లో సచిన్ దూబే  కిడ్నాప్ కేసు లో ఒక యువతి  సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  సచిన్ దుబేను కిడ్నాప్ చేసి హింసించడంతో పాటు అతని వస్తువులను లాక్కొని డబ్బులు  డిమాండ్ చేసిన నలుగురిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.  

అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సచిన్ దూబే బంజారా హిల్స్ లో ఒక జ్యువెలరీ షాప్ లో భాగస్వామి. సచిన్ మత్తులో ఉన్న సమయంలో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఐదుగురు సభ్యులు గల ముఠా వద్దకు చేరుకుంది.   ఈ వీడియోలు చూసిన తర్వాత గ్యాంగ్ కి సచిన్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆశ పుట్టింది.  దీంతోఅతడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్   చేశారు. సచిన్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడంతో పాటు   డబ్బులు డిమాండ్ చేసిన కేసులో  బార్ డ్యాన్సర్ డింపుల్ తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.