Publish Date:Aug 18, 2025
నెల్లూరులో ఓ మహిళా మణి . ఈమె పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఓ బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆ ఆట ఆడారు. వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పోలీసు అధికారులు అంతా ఆమె గుప్పెట్లో ఉన్నారనే టాక్ ఉంది. అప్పుడు ఆమె ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా సాగింది… కూటమి పాలనలోనూ అదే ఆట ఆడాలనుకున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్నీ బయటకు వస్తున్నాయి.
ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి నెల రోజుల పెరోల్ పచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పెరోల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాకరించారు. అయితే ఓ రోజు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. దాంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తీగ లాగితే డొంక కదిలింది. ఈ పెరోల్ కథ అంతా ఓ మహిళ నడిపిందని .. కొంత మంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది.
ఆ మహిళ నెల్లూరులో ఓ బొటిక్ నిర్వహిస్తారు. వైసీపీ హయాంలో ఆమె పోలీసులకు.. రాజకీయ నేతలకు బొకేలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో కనిపించారు. ఆ సమయంలోనే ఆమె సెటిల్మెంట్లు చేసేవారు. ఏ పనైనా పోలీసు శాఖలో అయితే ఇట్టే చేయించేవారు. దీంతో ఆమె పలుకుబడి పెరిగిపోయింది. ఈమె లవరే శ్రీకాంత్. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఓ సారి అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ నెరజాణ తన లవర్తో గడిపేందుకు నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి పోలీసులు అడ్డు చెప్పలేదు. వారిద్దరూ రొమాన్స్లో మునిగిపోయి వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈమె భర్త అనుమానాస్పదస్థితిలో చనిపోయాడని చెబుతున్నారు. ఇప్పుడీ నెరజాణ గురించి మొత్తం బయటకు వస్తోంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు ఎవరు.. రాజకీయ నేతలు ఎవరు.. అన్నీ బయటకు తీసే పనిలో అధికారులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lady-don-in-nellore-25-204451.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.