లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డిలో అరెస్టు భయం

Publish Date:Jul 15, 2025

Advertisement

తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు.  సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది.  తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది.  లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో  బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది.  ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.  

ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎన్డీయే సర్కార్ 30 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాక్‌ను అడిగింది.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆగష్టు 25 నుంచి అర్హులు అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూవివాదం కేసులో ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెలిసిందే.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. దీంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.
తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహంలో మంత్రి పాల్గొన్నారు.
సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు.. అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల నుంచే కాకుండా ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది. సింగపూర్ నైపుణ్యాలు ఏపీకి అవసరం అంటూ చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు, ప్రభుత్వాన్ని కోరుతుంటే.. అందుకు ప్రతికా వారి నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక అవగాహన ఒప్పందం జరిగింది.
ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్బంగా లోక్ సభలో ప్రధాన మోదీపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సైటైర్ల వేశారు.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరు పేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో మంగళవారం (జులై 29) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కశ్మీర్ పహల్గామ్‌ మారణహోమానికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై బాధిత కుటుంబలు హర్షం వ్యక్తం చేశాయి.
పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై పార్లమెంటులో సోమవారం ప్రారంభమైన చర్చ సభ లోపల వెలుపల కూడా రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ విరమణ వెంక ఉన్న రహస్యం ఏమిటి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.