జగన్ నెత్తిన లడ్డూ బాంబు!?

Publish Date:Sep 23, 2024

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా, ఆఖరికి జాతీయ మీడియా కూడా లడ్డూ వ్యవహారంపైనే ఫోకస్ చేసింది.  లడ్డూ వివాదంపై జగన్ మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు గుప్పించినా కూడా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం  జగన్ పాలనలోనే జరిగిందని జనం నమ్ముతున్నారు. జగన్ కౌంటర్ అటాక్ ను పట్టించుకున్న వారే లేరు. చివరాఖరికి వైసీపీ శ్రేణులు కూడా జగన్ రాజకీయ విమర్శలను నమ్మడం లేదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకు హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదనీ, అందుకే కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నా పట్టించుకోలేదనే విశ్వసిస్తున్నారు. దీంతో లడ్డూ వివాదం నుంచి ఎలా బయటపడాలో, అసలీ వివాదంపై ఎలా స్పందించాలో కూడా తెలియక వైసీపీ నేతలు, శ్రేణులు చేష్టలుడిగాపోయాయి. రాజకీయంగానే కాదు, నైతికంగా కూడా వైసీపీ ప్రతిష్ట అధ: పాతాళానికి పడిపోయిందనడంలో సందేహం లేదు. 

మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం జగన్ కు, ఆయన పార్టీకీ తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు కానీ, లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంత కంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవ్వడమే కాకుండా.. కచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రజలలో ఆగ్రహావేశాలను నింపింది. 

లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయన్న సంగతి వెలుగు చూడగానే వైసీపీలో మేధావులుగా పరిగణింపబడుతున్న వారు దీని వల్ల పార్టీకి జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలు వేయడం ప్రారంభించారు. జగన్  మీడియా సమావేశం కారణంగా మరింత డ్యామేజి జరిగింది తప్ప పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వారు నిర్ధారణకు వచ్చారు. కల్తీ జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు కానీ దానిని బయటపెట్టి తిరుమల దేవుని ప్రతిష్ఠకు భంగం కలిగిస్తారా అంటూ జగన్ మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం వైసీపీకి బూమరాంగ్ అయ్యింది. జగనే స్వయంగా కల్తీ జరిగినట్లు అంగీకరించినట్లైంది. 

ఇక ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి వాటిల్లిన, వాటిల్లబోయే నష్టం విషయానికి వచ్చే ముందు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేసిన బీజేపీ.. ఆ తరువాత కొద్ది కాలానికే అప్పటి ప్రతిపక్షమైన వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. 2019 ఎన్నికల నాటికి పరోక్షంగా జగన్ కు అన్ని విధాలుగా పరోక్ష సహకారం అందించింది.  మళ్లీ 2024 ఎన్నికలు వచ్చే సరికి తెలుగుదేశంతో జట్టు కట్టింది. అంటే రాష్ట్రంలో కనీస బలం కూడా లేని బీజేపీ తన అవసరాలు, పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. అన్నిటికీ మించి తన రాజకీయ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ను ఒక లేబొరేటరీలా వాడుకుంటోంది. ఈ  ప్రయోగాల కారణంగా ఏపీ ఏ గంగలో కలిసినా ఫర్యాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  

అయితే ఇక ఇప్పుడు అంటే లడ్డూ వివాదం తరువాత ఆ పార్టీకి ఆ అవకాశం ఇసుమంతైనా లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా.. జగన్ కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందూత్వను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది. 
చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వెనుక ఉన్నది వైసీపీయేనని సందేహాలకు అతీతంగా ఎస్టాబ్లిష్ చేశారు. దేవుడికి జరిగిన మహాపచారంలో వైసీపీ ప్రమేయం ఉందని నిరూపించేశారు. దీంతో వైసీపీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూతపడేలా చేశారు. జగన్ తో ఏ రకంగానైనా సంబంధాలు కొనసాగిస్తే బీజేపీ దేశ వ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి గురౌతుంది. ఆ కారణంగానే బీజేపీ ద్వారాలు జగన్ కు ఇక ఎప్పటికీ తెరుచుకునే పరిస్థితి లేదు. 

ఆ సంకేతాలు ఇప్పటికే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వద్ద బీజేపీ ధర్నా జరగడాన్ని చెప్పవచ్చే. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు నేతలు వైసీపీపై జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతొ ఇక వైసీపీ ఎప్పటికీ బీజేపీకి అంటరాని పార్టీగా మారిపోయిందనే చెప్పాలి.  అంటే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ స్పీడందుకుంటుందన్నమాట. జగన్ లో ఇప్పటికే ఆ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

By
en-us Political News

  
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.