మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్పై రాసిన రైతే రాజు అయితే... పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనను ఆంధ్రావాడు అని అనవద్దన్నారు. తాను తెలంగాణకు చెందిన వ్యక్తినని స్పష్టం చేశారు.
దేశవిదేశాల్లో సైతం మనవాళ్లను లోకల్గా గుర్తిస్తున్నారని గుర్తు చేశారు. వీలైతే.. తనను కూడా సగం తెలంగాణ వాడిగా అయినా గుర్తించండంటూ సభా ముఖంగా కేవీపీ విజ్జప్తి చేశారు. 1980లో హైదరాబాద్ వచ్చానని.. నాటి నుంచి తాను హైదరాబాద్లోనే ఓటు హక్కు వినియోగించుకొన్నానన్నారు. తాను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని ఆయన తన ప్యామిలీ సాక్షిగా ప్రమాణం చేసి మరీ స్పష్టం చేశారు. కేవీపీ వ్యాఖ్యలు.. పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. అయితే కేవీపీ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం.. పరమార్థం.. ఏమై ఉంటాయా అనే ఓ సందేహం కూడా ఆ సర్కిల్లో వ్యక్తమవుతోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉండమే కాకుండా.. అధికార బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థిగా మారిందని.. అదీకాక బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని.. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్లో సాగుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయిందని.. రామాయణంలో ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చినా.. ఆ పార్టీ ఆ రాష్ట్రంలో బతికి బట్టకట్టే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదని.. అలాంటి ఏపీలో కాంగ్రెస్ పార్టీ భాద్యతలు వైఎస్ షర్మిల చేపడితే.. హస్తం పార్టీలో చురుకుదనం, చలాకీదనం వచ్చే పరిస్థితి మాత్రం లేదని.. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో వైఎస్ షర్మిల వెంట ఉండాలంటూ హస్తం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. మనస్సు ఒప్పకోకపోయినా.. ఆ ఆదేశాలకు కట్టుబడి ఆమె వెంట వెళ్లాల్సి ఉంటుందని.. అందుకే ముందుగా కేవీపీ.. పార్టీ నేతలకు ముందరి కాళ్ల బంధం వేసి.. ముందే తెలంగాణ వాడిగా గుర్తించమంటూ మార్చి రాజకీయం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఓ వేళ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదో ఒక పోస్టింగ్ అంటే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీకి కేటాయించిన లాంటి పోస్టింగ్ ఇచ్చినా... మరో అయిదేళ్లు అలా.. అలా.. గడిచిపోతాయని కేవీపీ భావిస్తున్నారంటున్నారు.
ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీలో.. వైఎస్ఆర్ టీపీ వీలినం చేసేందుకు ఇప్పటికే వైయస్ షర్మిల సంసిద్దత వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హస్తం పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీతో భేటీ అయి ఆమె చర్చించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో వైయస్ షర్మిల ఎంట్రీ దాదాపుగా ఖయమైపోయింది. ఇక సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత పేరుతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు.
ఈ ర్యాలీలో వైఎస్ షర్మిల పాల్గొంటారని సమాచారం. అదే రోజు.. పార్టీ వీలినం కూడా జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఓ వేళ... అదే రోజు పార్టీ వీలినం అయితే.. తెలంగాణలో వైఎస్ షర్మిలకు సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కేవీపీకి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఆయనకు అంతకంటే కావాల్సింది ఏముందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లోవాడి వేడిగా నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kvp-changed-route-25-161205.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.