ఆళ్ళగడ్డ రూటే సపరేటు, పదేళ్లలో పది ఎన్నికలు
Publish Date:Mar 14, 2012
Advertisement
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో తరచూ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 1989-99 మధ్య ఆళ్ళగడ్డ ఓటర్లు 5 సార్లు ఎంపి ఎన్నికలు, 5 సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1991 లో నంద్యాల పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో ప్రతాపరెడ్డి గెలిచారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పివి నరసింహారావు కోసం ఆయన రాజీనామా చేశారు. 1995 లో పార్లమెంట్ కు జరిగిన సాధారణ ఎన్నికల్లో నంద్యాల నుంచి ప్రధాని పివి నరసింహారావు పోటీ చేసి తక్కువ మెజారిటీతో గెలుపొందడంతో రాజీనామా చేశారు. 1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలుపొందారు. కేంద్రంలో అనిశ్చితి ఏర్పడటంతో ప్రభుత్వాన్ని రద్దుచేసి 1997 లో ఉప ఎన్నిక నిర్వహించగా రెండోసారి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 1990లో మరోసారి కేంద్రంలో అనిశ్చితి ఏర్పడటంతో మళ్ళీ ఎన్నికలోచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా భూమా నాగిరెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 1989 ఎన్నికల్లో భూమా శేఖరరెడ్డి గెలుపొందారు. అయితే ఆయన హాఠాత్తుగా మరణించడంతో 1992 లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు భూమా నాగిరెడ్డిని ఎన్నుకున్నారు. 1994 లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో మరోసారి భూమా నాగిరెడ్డి గెలుపొందారు. 1996లో నంద్యాల ఎంపి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ఎంపిగా గెలవడంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 1997లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించగా శోభా నాగిరెడ్డి గెలిచారు. 1990 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె గెలుపొందారు. ఇలా ఆళ్లగడ్డ ఓటర్లు పదేళ్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని రికార్డును సృష్టించారు.
http://www.teluguone.com/news/content/kurnool-alagadda-24-12615.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





