Publish Date:Oct 11, 2022
డీకాక్, మార్క్రమ్, హెండ్రిక్స్, మలాన్వంటి హేమాహేమీ లం తా ఆఖరికి క్లాసెన్తో సహా పేక ల్లా పడిపోయారంటే క్రికెట్ అభి మానులు అస్సలు నమ్మడం లేదు. అంతటి దక్షిణాఫ్రికా జట్టూ కేవలం 99 పరుగులకే డగౌట్కి చేరిందంటే గిల్లుకుని అవును నిజమే నంటున్నారు. భారత్ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చాలాకాలం తర్వాత స్పిన్ తంత్రం అద్బు తంగా ప్రయోగించడంతో దక్షిణా ఫ్రికా 27.1 ఓవర్లలోనే 99 పరుగులకే చుట్టేసుకుపోయింది. భారత్ వంద పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పో యి సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కుల్దీప్ యాదవ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ హైదరాబాదీ స్టార్ భారత్ పేసర్ సిరాజ్ గెలు చుకున్నాడు.
భారత్ టాస్ గెలిచి బవుమా జట్టుకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. మలాన్, డీకాక్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో ఓవర్లోనే డీకాక్ వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ బంతిని సరిగా అర్ధంచేసుకోలేక వికెట్ సమర్పించుకున్నాడు. అలా మొదలైన మేడ కూలడం ఊహించని విధంగా ప్రేక్షకులను ఆనందం, ఆశ్చర్యభరితం చేసింది. ఎందుకంటే 5ఓవర్లకు 15 పరుగులు, 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులే చేసింది. ఇది నిజమా కలా అనుకున్నారంతా. మర్క్రమ్, క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. ఇక రెచ్చి పోతారనే ప్రేక్షకులు అనుకున్నారు. ఎక్కడా, మన బౌలర్లు కదలనిస్తేగా. మార్క్రమ్ను షాబాజ్ అవుట్ చేసే సమయా నికి అతగాడు కేవలం 9 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికా అలా కుంటుతూ 50 పరుగులు చేరుకునేసరికి 4 వికెట్లు కోల్పోయింది. అసలు ఒక్క ఫోర్ చూద్దా మన్నా అప్పటికి 50 బంతులయిపోయా! క్లాసెన్ కాస్తంత చేతులు ఝాడించి పరు గులు తీయనారం భిం చాడు. 19వ ఓవర్కి డేవిడ్ మిల్లర్ పెవిలియన్ దారి పట్టి మరింత కొంపముంచాడు. అలా 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిప్పేయడం దక్షిణాఫ్రికా బ్యాట ర్లకు వరల్డ్ కప్ వరకూ తప్ప కుండా గుర్తుంటుంది. వీడెవడ్రా బాబూ.. అనుకునే ఉంటారు! అలా బౌలర్ల ధాటికి లొంగిపోయిన దక్షిణాఫ్రికా 27.1 ఓబర్లలో 99 పరుగులు చేసింది. స్టార్ బౌలర్ కుల్దీప్ తన కోటా 4.1 ఓవర్లలో 4.32 ఎకానమీతో 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా సిరాజ్, ఆవేష్, సుందర్ కీలక సమయాల్లో రెండేసి వికెట్లు తీసి జట్టు విజయానికి తమ వంతు పాత్ర వహించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో క్లాసెన్ అత్యధికంగా 42 బంతుల్లో 34 పరుగులు, మలాన్ 27 బంతు ల్లో 15 పరుగులు చేశారంటే వారి పరిస్థితి అర్ధమవుతుంది.
నవ్వుకుంటూ డగౌట్ కి వెళ్లిన భారత్ 100 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగారు. కెప్టెన్ ధవన్, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరం భించారు. భారత్ మొదటి 5 ఓవర్లకే వికెట్ నస్టపోకుండా 35 పరుగులు చేశారు. గిల్ 20 బంతుల్లో 24 రుగులు చేశాడు. ఆరో ఓవర్లో ధవన్ రనౌట్ అయ్యాడు. అతను కేవలం 8 పరుగులే చేశౄడు. భారత్ పదో ఓవర్కి 1 వికెట్ నస్టపోయి 53 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో ఇరగదీసిన ఇషాన్ కేవలం 18 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. చిన్న స్కోర్ అయినా ఇలా అవుటవడం ప్రేక్షకులు కొంత ఆగ్రహానికీ గురయ్యారు. లక్నో మ్యాచ్ హీరో శ్రేయస్ అయ్యర్ గిల్ తో కలిసి వీరబాదుడు ఆరంభించాడు. దాంతో 15 ఓవర్లకు భారత్ 77 పరగులకు చేరుకుంది. 16వ ఓవర్కు 85, 18.2కి 97 రుగులు చేసింది. ఇక్కడే గిల్ పెవిలియన్ దారి పట్టాడు. అప్పటిదాకా అద్భుతంగా ఆడి 49 పరుగుల చేశాడు. తర్వాత శాంసన్, శ్రేయాస్ లు ఇన్నింగ్స్ మ్యాచ్ ముగించేశారు. శ్రేయస్ 23 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ సిరీస్ గెలిచి నట్ట యింది. ఈ ఘన విజయంతో భారత్ బౌలర్లు సెలక్టర్లను బాగా ఆకట్టుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kuldeep-let-southafricas-loss-at-delhi-39-145273.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.