Publish Date:Aug 22, 2025
సినిమాల్లో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం... పబ్జి వంటి గేమ్ షోలో గన్ పట్టుకుని ఎదురు వచ్చిన శత్రువులను తుపాకిలతో కాల్చి చంపడం...ఇటువంటి రక్తపాతం లాంటి సీన్లు చూసి పిల్లలు మైండ్ సెట్ మారు తుందనడానికి కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు ఓ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు...
తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలి యగానే పోలీసులు, స్థానికులు ఒక్క సారిగా అవ్వక్క య్యారు. గత ఐదు రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు.
చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే నిందితుడి గా బయటపడింది. పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చి రాని ఇంగ్లీషు లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీషులో ఓ లెటర్ రాసుకున్నాడు. బాలిక సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లిన అనంతరం పక్కింట్లో ఉన్న బాలుడు దొంగతనం చేయడానికి సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చాడు. మెల్లిగా దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సహస్ర అక్కడికి వచ్చింది. దొంగ తనం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది.
దీంతో భయపడిపోయిన బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్ర పై దాడి చేసి 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బాలుడు సహస్ర ఇంట్లో నుండి పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడులో తెలియని భయం మొదలైంది.
అది గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే ఎస్ఓటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ ఓ టి పోలీసులు బాలుడు చదువు తున్న స్కూల్ కి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏమి చెప్పలేదు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఇంగ్లీషులో రాసుకున్న ఒక లెటర్, ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukatpally-25-204798.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.