Publish Date:Aug 22, 2025
సినిమాల్లో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం... పబ్జి వంటి గేమ్ షోలో గన్ పట్టుకుని ఎదురు వచ్చిన శత్రువులను తుపాకిలతో కాల్చి చంపడం...ఇటువంటి రక్తపాతం లాంటి సీన్లు చూసి పిల్లలు మైండ్ సెట్ మారు తుందనడానికి కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు ఓ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు...
తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలి యగానే పోలీసులు, స్థానికులు ఒక్క సారిగా అవ్వక్క య్యారు. గత ఐదు రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు.
చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే నిందితుడి గా బయటపడింది. పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చి రాని ఇంగ్లీషు లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీషులో ఓ లెటర్ రాసుకున్నాడు. బాలిక సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లిన అనంతరం పక్కింట్లో ఉన్న బాలుడు దొంగతనం చేయడానికి సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చాడు. మెల్లిగా దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సహస్ర అక్కడికి వచ్చింది. దొంగ తనం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది.
దీంతో భయపడిపోయిన బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్ర పై దాడి చేసి 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బాలుడు సహస్ర ఇంట్లో నుండి పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడులో తెలియని భయం మొదలైంది.
అది గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే ఎస్ఓటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ ఓ టి పోలీసులు బాలుడు చదువు తున్న స్కూల్ కి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏమి చెప్పలేదు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఇంగ్లీషులో రాసుకున్న ఒక లెటర్, ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukatpally-25-204798.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.